శ్రీలంక క్రికెటర్ కుశాల్ మెండిస్‌కి బెయిల్

     Written by : smtv Desk | Tue, Jul 07, 2020, 03:31 PM

శ్రీలంక క్రికెటర్ కుశాల్ మెండిస్‌కి బెయిల్

యాక్సిడెంట్ కేసులో అరెస్టయిన శ్రీలంక క్రికెటర్ కుశాల్ మెండిస్‌కి బెయిల్ లభించింది. శనివారం మద్యం సేవించి కారు నడిపిన కుశాల్ మెండిస్.. ఓ 64 ఏళ్ల వృద్ధుడి మృతికి కారణమయ్యాడు. దాంతో.. అరెస్ట్ చేసిన పోలీసులు మెజిస్ట్రేట్ అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించగా.. ఈరోజు అతనికి బెయిల్ లభించింది. ఈ శ్రీలంక వికెట్ కీపర్ ఒక్క రోజు మాత్రమే పోలీసు కస్టడీలో ఉన్నాడు. సెప్టెంబరు 9న కోర్టుకి

కుశాల్ మెండిస్ హాజరుకానున్నట్లు తెలిసింది.

కొలంబోలోని పాండ్వారా రోడ్డుపై ఈ యాక్సిడెంట్ జరగగా.. పోలీసులు సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించి వివరాలు సేకరించారు. అందులో కుశాల్ నడిపిన కారు.. సైకిల్‌పై వెళ్తున్న వృద్ధుడ్ని ఢీకొని అనంతరం రోడ్డు పక్కన ఉన్న గోడని ఢీకొట్టినట్లు తేలింది. కారు నడిపిన సమయంలో కుశాల్ మెండిస్ మద్యం సేవించి ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు శ్రీలంక మీడియా స్పష్టం చేసింది.

శ్రీలంక క్రికెట్ బోర్డు ఉద్యోగి వివాహానికి హాజరైన కుశాల్ మెండిస్ తిరుగు ప్రయాణంలో ఈ యాక్సిడెంట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ వివాహానికి మెండిస్‌తో పాటు చాలా మంది శ్రీలంక క్రికెటర్లు వెళ్లారు. ఆ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్ నిబంధనల్ని పూర్తిగా ఎత్తివేయడంతో.. వివాహాలు, పంక్షన్లకి అనుమతి లభించింది.





Untitled Document
Advertisements