కార్‌ లోన్ ఆఫర్ అదుర్స్...రూ.లక్షకు రూ.899 ఈఎంఐ రుణం!

     Written by : smtv Desk | Tue, Jul 07, 2020, 05:20 PM

కార్‌ లోన్ ఆఫర్ అదుర్స్...రూ.లక్షకు రూ.899 ఈఎంఐ రుణం!

దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా తాజాగా కస్టమర్లకు తీపికబురు అందించింది. కొత్తగా కారు కొనుగోలు చేసే వారికి పలు రకాల బెనిఫిట్స్‌ను అందిస్తోంది. తక్కువ వడ్డీకే రుణ సౌకర్యం, అతితక్కువ నెలవారీ ఈఎంఐ, లోన్ మారటోరియం వంటి పలు ప్రయోజనాలు కల్పిస్తోంది. వీటి కోసం మారుతీ సుజుకీ తాజాగా యాక్సిస్ బ్యాంక్‌తో జతకట్టింది.

యాక్సిస్ బ్యాంక్ మారుతీ సుజుకీ కారు కొనుగోలు చేసే వారికి పలు రకాల లోన్ ఆప్షన్స్ అందిస్తోంది. వేతన జీవులు కారు ధరకు సమానమైన మొత్తాన్ని రుణం రూపంలో పొందొచ్చు. తీసుకున్న రుణాన్ని 8 ఏళ్లలో చెల్లించాల్సి ఉంటుంది. ఆకర్షణీయమైన ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.


కారు కొనుగోలుదారులు ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే రూ.లక్షకు రూ.1250 నుంచి ఈఎంఐ ప్రారంభమౌతుంది. అంతేకాకుండా కరోనా వైరస్ నేపథ్యంలో లోన్ తీసుకునే వారికి మరో ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. తొలి మూడు ఈఎంఐలకు నెలకు రూ.899 చెల్లిస్తే సరిపోతుంది. ఇంకా పలు రకాల ఈఎంఐ ఆప్షన్లు ఉన్నాయి.




మారుతీ సుజుకీ యాక్సిస్ బ్యాంక్ ఆఫర్లు కేవలం జూలై 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కేవలం ఉద్యోగం చేసేవారు మాత్రమే కాకుండా స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా కారు కొనేందుకు సులభంగానే రుణం పొందొచ్చు.

ఇన్‌కమ్ ప్రూఫ్ లేకపోయినా కూడా రుణం పొందొచ్చని యాక్సస్ బ్యాంక్ తెలిపింది. మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్) శశాంక్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. కోవిడ్ 19 కారణంగా ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చిందని, ఎక్కడికైనా వెళ్లాలంటే సొంత వెహికల్ గురించి ఆలోచిస్తున్నారని తెలిపారు.





Untitled Document
Advertisements