ఇండియాలో బడ్జెట్ ఫోన్ నార్డ్ ను లాంచ్ చేయనున్న వన్ ప్లస్

     Written by : smtv Desk | Tue, Jul 07, 2020, 06:42 PM

ఇండియాలో బడ్జెట్ ఫోన్ నార్డ్ ను లాంచ్ చేయనున్న వన్ ప్లస్

వన్ ప్లస్ బడ్జెట్ ఫోన్ వన్ ప్లస్ నార్డ్ మనదేశంలో జులై 21వ తేదీన లాంచ్ కానుంది. ఈ మేరకు అమెజాన్ ఇండియా పేజ్ లిస్ట్ అయింది. కాకపోతే వెంటనే దాన్ని మళ్లీ తీసేశారు. దీని ప్రకారం వన్ ప్లస్ నార్డ్ లాంచ్ ఏఆర్ ఈవెంట్ ద్వారా జరుగుతుంది. వన్ ప్లస్ కొత్త తరహా లాంచ్ లకు పెట్టింది పేరు. అలాగే దీని లాంచ్ కూడా కొత్త అనుభూతిని ఇవ్వనుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్ పై పనిచేయనుంది. దీని ధర 500 డాలర్లలోపే ఉండనుంది.

అమెజాన్ ఇండియా టీజర్ పేజీలో వన్ ప్లస్ నార్డ్ లాంచ్ కు సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఈ ఇమేజెస్ ప్రకారం ఏఆర్ లాంచ్ ఈవెంట్ కు ఆహ్వానాలను వన్ ప్లస్ అందించింది. జులై 21వ తేదీ నుంచి దీన్ని అనుభూతి చెందవచ్చు అని కూడా ఈ టీజర్ పేజ్ లో ఉంది. ఈవెంట్ పేజీకి సంబంధించిన లింక్ ను కూడా అందించారు. కాకపోతే ఈ లింక్ ఇంకా లైవ్ అవ్వలేదు.

ఈ లిస్టింగ్ ను మొదటగా టెక్ రాడార్ గుర్తించింది. వన్ ప్లస్ నార్డ్ కు సంబంధించిన అధికారిక సమాచారాన్ని వన్ ప్లస్ అందించలేదు. అయితే అమెజాన్ ఈ విషయంలో కాస్త తొందరపడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పేరు కూడా వన్ ప్లస్ ఇటీవలే తెలిపింది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్ ను ఇందులో అందించనున్నారు. ఇండియా, యూరోప్ దేశాల్లో ఈ ఫోన్ మొదట లాంచ్ కానుంది.

వన్ ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పెయి ఈ సందర్భంగా మాట్లాడుతూ వన్ ప్లస్ నార్డ్ అమెరికాలో లాంచ్ అవ్వదని, కానీ భవిష్యత్తులో లాంచ్ చేయబోయే ఫోన్లు మాత్రం అక్కడ కూడా లాంచ్ అవుతాయని తెలిపారు.

తాజాగా దీనికి సంబంధించిన టీజర్ వీడియో, బాక్స్ ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే ముందువైపు రెండు కెమెరాలు ఉన్నట్లు కూడా ఈ వీడియోలో చూడవచ్చు. లాంచ్ అయ్యే లోపు ఈ ఫోన్ మీదనున్న అంచనాలు మరింతగా పెరుగుతాయి.





Untitled Document
Advertisements