ప్రయాణికులకు గుడ్ న్యూస్: రైల్వేస్ నుంచి వినూత్న సేవలు

     Written by : smtv Desk | Tue, Jul 07, 2020, 08:04 PM

ప్రయాణికులకు గుడ్ న్యూస్: రైల్వేస్ నుంచి వినూత్న సేవలు

ఇండియన్ రైల్వేస్ ఎప్పటికప్పుడు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా రైల్వేస్ వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. ఈసారి ఎలక్ట్రిసిటీని ఆదా చేయాలనే లక్ష్యంగా తగిన ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఇప్పటికే పలు వెస్ట్ సెంట్రల్ రైల్వేస్ వినూత్నమైన ఆలోచనను అమలు చేస్తున్నాయి. ఇది ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ రైల్వే స్టేషన్‌లో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందులో ట్రైన్ ప్లాట్‌ఫామ్ మీదకు వస్తున్నప్పుడు స్టేషన్‌లోని లైట్లు వెలుగుతాయి.

అలాగే రైలు స్టేషన్‌ వదిలి వెళ్లిపోయేటప్పుడు లైట్స్ ఆఫ్ అవుతాయి. దీంతో ఎలక్ట్రిసిటీ ఆదా అవుతుంది. అయితే ఇక్కడ రైల్వే స్టేషన్‌లో లైట్స్ అన్నీ ఆగిపోతే ఎలా మరి? అని చాలా మందికి సందేహం వచ్చి ఉండొచ్చు. రైల్వే స్టేషన్‌లో లైట్స్ అననీ ఆరిపోవు. 30 శాతం లైట్లు అలాగే వెలుగుతూ ఉంటాయి.

అంటే రైలు స్టేషన్‌లోకి వచ్చేటప్పుడు అన్ని లైట్లు వెలుగుతాయి. తర్వాత ట్రైన్ రైల్వే స్టేషన్‌ను వదిలి వెల్లేటప్పుడు 70 శాతం లైట్లు ఆఫ్ అవుతాయి. ఇక మిగతా 30 శాతం లైట్లు అలాగే వెలుగుతూ ఉంటాయి. దీంతో ప్రయాణికులకు కూడా ట్రైన్ వస్తున్నట్లు సులభంగా తెలుస్తుంది.


లైట్ ఆఫ్, ఆన్ వ్యవస్థ సిగ్నల్ వ్యవస్థతో అనుసంధానమై ఉంటుందని అందువల్ల కరెక్ట్‌గా పనిచేస్తాయని వెస్ట్ సెంట్రల్ రైల్వే పీఆర్‌వో తెలిపారు. కాగా రానున్న రోజుల్లో ఈ లైట్ వ్యవస్థ మిగతా స్టేషన్లలో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశముంది.





Untitled Document
Advertisements