అంబులెన్స్ నడిపిన నగరి ఎమ్మెల్యే రోజా

     Written by : smtv Desk | Tue, Jul 07, 2020, 08:12 PM

అంబులెన్స్ నడిపిన నగరి ఎమ్మెల్యే రోజా

నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా తాజాగా న‌గ‌రి పుత్తూరు పున్నమి సర్కిల్‌లో వైఎస్సార్ విగ్ర‌హం వ‌ద్ద 108, 104 అంబులెన్సు వాహ‌నాల‌ను ప్రారంభించారు. స్వయంగా అంబులెన్స్ వాహనాన్ని నడిపి వార్తల్లో నిలిచారు. ఆమె అంబులెన్స్ వాహనం నడపడం పార్టీ కార్యకర్తలో సరికొత్త జోష్ నింపింది. టీడీపీ హయాంలో అంబులెన్స్ వ్యవస్థను భ్రస్టుపట్టించారని ఆమె గుర్తు చేశారు. జగన్ సీఎం అయ్యాక మళ్లీ 104, 108 వ్యవస్థకు ప్రాణంపోశారని తెలిపారు. గతంలోని అంబులెన్స్ లోని సౌకర్యాల కంటే కొత్తగా వచ్చిన అంబులెన్స్ వాహనాల్లో చాలా సదుపాయాలు ఉండటంపై సంతోషం వ్యక్తం చేశారు. ఆమె తీరును చూసిన స్థానికులంతా ‘అదిరిందమ్మ రోజా’ అంటూ కితాబిస్తున్నారు.





Untitled Document
Advertisements