నితీష్ కుమార్ మేనకోడలు కి కరోనా

     Written by : smtv Desk | Tue, Jul 07, 2020, 10:54 PM

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. వందల సంఖ్యలో నుండి వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే తాజాగా సీఎం మేన కోడలికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. బీహార్ ముఖ్యమంత్రి అయిన నితీష్ కుమార్ మేనకోడలు కి కరోనా సోకడం తో ఆమెను పాట్నా లోని ఏయింస్ కి తరలించారు. అయితే తాను ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నారు.

ముఖ్యమంత్రి నివాసం లో ఉంటున్న తన మేనకోడలు కి కరోనా వైరస్ సోకడం తో సీఎం ఇంటికి పూర్తి గా శానిటైజ్ చేశారు అధికారులు. అంతేకాక ఆ ఇంటి కుటుంబ సభ్యులు సైతం కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కొనున్నారు. బీహార్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 12,525 నమోదు కాగా, 97 మంది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రాణాలను కోల్పోయారు. అయితే తాజాగా చేయించుకున్న కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలలో సీఎం నితీశ్ కుమార్ కి కరోనా వైరస్ నెగటివ్ అని వచ్చింది.





Untitled Document
Advertisements