షాకింగ్: ఐశ్వర్యరాయ్, ఆరాధ్యకు కూడా కరోనా పాజిటివ్

     Written by : smtv Desk | Sun, Jul 12, 2020, 06:08 PM

షాకింగ్: ఐశ్వర్యరాయ్, ఆరాధ్యకు కూడా కరోనా పాజిటివ్

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. అమితాబ్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయనకు కొవిడ్-19 పరీక్ష చేశారు. పాజిటివ్ అని తేలడంతో శనివారం ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో చేశారు. ఆ వెంటనే అభిషేక్ బచ్చన్‌కు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన కూడా తండ్రితో పాటే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

అయితే, అమితాబ్ భార్య జయా బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్యకు శనివారం యాంటిజెన్ టెస్ట్ చేయగా నెగిటివ్ అని వచ్చింది. కానీ, వీరి స్వాబ్ టెస్ట్ రిపోర్ట్స్ ఆదివారం వచ్చాయి. ఈ రిపోర్ట్స్‌లో ఐశ్వర్యరాయ్, ఆరాధ్యలకు కరోనా పాజిటివ్ అని తేలింది. జయా బచ్చన్‌కు మాత్రం నెగిటివ్ వచ్చింది. అలాగే, తన పిల్లలతో కలిసి అమితాబ్ ఇంట్లోనే ఉంటోన్న ఆయన కుమార్తె శ్వేతా నంద ఫ్యామిలీకి కూడా కరోనా టెస్ట్‌లు చేశారు. ఈ పరీక్షల్లో శ్వేతా నంద, ఆమె కుమారుడు అగస్త్య నంద, కుమార్తె నవ్య నవేలికి కొవిడ్ నెగిటివ్ వచ్చింది.
ఇదిలా ఉంటే, బచ్చన్ బంగ్లా ‘జల్సా’ను బృహత్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించింది. ఆదివారం ఉదయం బంగ్లాను బీఎంసీ కార్మికులు పూర్తిగా శానిటైజ్ చేశారు. కాగా, ఐశ్వర్యరాయ్ బచ్చన్, ఆమె కుమార్త ఆరాధ్యకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపె ఖరారు చేశారు. జయా బచ్చన్‌కు మాత్రం నెగిటివ్ వచ్చిందన్నారు. బచ్చన్ ఫ్యామిలీ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.





Untitled Document
Advertisements