బంగార ధర డౌన్...వెండి జిగేల్!

     Written by : smtv Desk | Mon, Jul 13, 2020, 10:11 AM

బంగార ధర డౌన్...వెండి జిగేల్!

బంగారం ధర మరోసారి తగ్గింది. వరుసగా రెండో రోజు కూడా దిగొచ్చింది. పసిడి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చ. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా కూడా దేశీ మార్కెట్‌లో పసిడి ధర పడిపోవడం గమనార్హం. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పైపైకి చేరింది.

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.30 దిగొచ్చింది. దీంతో ధర రూ.51,170కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.30 తగ్గుదలతో రూ.46,890కు పడిపోయింది.

పసిడి ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పైకి కదిలింది. కేజీ వెండి ధర రూ.50 పెరిగింది. దీంతో ధర రూ.52,000కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.19 శాతం పైకి కదిలింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1805 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా పరుగులు పెట్టింది. వెండి ధర ఔన్స్‌కు 0.55 శాతం పెరుగుదలతో 19.15 డాలర్లకు ఎగసింది.

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 పైకి కదిలింది. దీంతో ధర రూ.47,800కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.100 పెరుగుదలతో రూ.49,000కు క్షీణించింది. ఇక కేజీ వెండి ధర రూ.50 పెరిగింది. రూ.52,000కు చేరింది.

ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.





Untitled Document
Advertisements