అదిరిపోయే బిజినెస్ ఐడియా....రూ.50వేలతో ఇలా రూ.6 లక్షలు సంపాదించండి

     Written by : smtv Desk | Mon, Jul 13, 2020, 10:19 AM

అదిరిపోయే బిజినెస్ ఐడియా....రూ.50వేలతో ఇలా రూ.6 లక్షలు సంపాదించండి

కరోనా వైరస్ దెబ్బకి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. వలస కూలీలు, పేదలు సహా ఉద్యోగులకు కూడా గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. చాలా మంది ఉపాధి కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదాయం పొందాలని భావించే వారికి ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది.

అదే మెడిసినల్ ప్లాంట్స్ పెంపకం. వైద్యంలో ఉపయోగించే మొక్కలను పంచడం ద్వారా మంచి రాబడి పొందొచ్చు. ఆయుర్వేదం కాకుండా అల్లోపతిలో కూడా పలు రకాల మొక్కలను ఉపయోగిస్తుంటారు. దీంతో మెడిసినల్ ప్లాంట్లకు డిమాండ్ కూడా పెరిగింది.

Also Read: LIC స్కీమ్‌లో చేరితే ప్రతి నెలా రూ.9,000.. మోదీ సర్కార్ హామీ!

శాతవారీ మొక్కల పెంపకంతో చాలా బెనిఫిట్ పొందొచ్చు. వీటిని పలు రకాల ఔషధాల తయారీలో వినియోగిస్తూ ఉంటారు. శాతవారీ మొక్కల పెంపకంతో ఎకరాకు రూ.6 లక్షల వరకు పొందొచ్చు. దీని కోసం రూ.50,000 ఖర్చు పెడితే సరిపోతుంది.

Also Read: రోజుకు రూ.230తో ఇలా చేతికి ఏకంగా రూ.కోటి!

శాతవారీ అనేది గ్రేడ్ ఏ మెడిసినల్ ప్లాంట్. ఈ పంట 18 నెలలకు చేతికి వస్తుంది. శాతవారీ మొక్క వేరు నుంచి ఔషధాన్ని తయారు చేస్తారు. వేర్లను బాగా ఎండబెట్టిన తర్వాత విక్రయించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 10 క్వింటాళ్ల వేర్లను ఎండబెట్టిన తర్వాత అవి 3 క్వింటాళ్లు అవుతాయి. ధర అనేది వేర్ల నాణ్యత ప్రాతిపదికన నిర్ణయమౌతుంది.



విత్తనాలు మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. ఒక ఏకరాకు 20 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మార్కెట్‌లో ఒక క్వింటా ధర రూ.50 వేల నుంచి రూ.60 వరకు పలుకుతుంది. పంటకు డైరెక్ట్‌గా ఆయుర్వేదిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీలకు విక్రయించొచ్చు. శాతవారీ ద్వారా ఖర్చులు అన్నీ పోనూ కనీసం రూ.6 లక్షలు పొందొచ్చు.





Untitled Document
Advertisements