జాతీయ స్థాయిలో దక్షిణాది సినిమాకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన దర్శకులు చాలా మంది ఉన్నారు. అలాంటి నేటి తరం దర్శకుల్లో ముందు వరుసలో ఉన్న దర్శకుడు శంకర్. ప్రస్తుతం ఈయన తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఇండియన్ 2’. పాతికేళ్ల ముందు ఈయన తెరకెక్కించిన ఇండియన్ సినిమాకు ఇది సీక్వెల్. దీని ముందు చిత్రం ‘2.0’ కూడా ‘రోబో’కు సీక్వెల్గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కాగా.. తదుపరి కూడా శంకర్ తన సినిమాల్లో ఘన విజయం సాధించిన ‘ఒకే ఒక్కడు’ చిత్రానికి సీక్వెల్ను తెరకెక్కించాలనుకుంటున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం.
పొలిటికల్ టచ్తో తెరకెక్కిన ఒకేఒక్కడులో అర్జున్ హీరోగా నటించారు. సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సీక్వెల్లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించబోతున్నారని టాక్. విజయ్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆయన రాజకీయ నేపథ్యంలో సాగే 'ఒకేఒక్కడు' సీక్వెల్గా నటిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.