లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ కుటుంబంలో కరోనా కలకలం రేపింది. అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్, మనవరాలు ఆరాధ్య కరోనా బారిన పడ్డారు. అయితే.. తాజాగా బచ్చన్ ఫ్యామిలీలో కరోనా కల్లోలానికి సంబంధించి ఓ విషయం తెలిసింది. అమితాబ్కు, అభిషేక్కు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్గా తేలింది. కానీ.. ఐశ్వర్యా రాయ్కు మాత్రం ఎలాంటి కరోనా లక్షణాలు బయటపడలేదని తెలిసింది.
కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు నిర్వహించగా ఐశ్వర్య, ఆరాధ్య కూడా కరోనా బారిన పడినట్లుగా వైద్యులు నిర్ధారించారట. అంతేకాదు, ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని, ఐశ్వర్య, ఆరాధ్య హోం క్వారంటైన్లో ఉంటే సరిపోతుందని వైద్యులు స్పష్టం చేశారు. అందువల్లే.. వీరిద్దరూ ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారు.