టెలికం యూజర్లకు ఝలక్.... ప్రీమియం ప్లాన్స్ బ్లాక్!!!

     Written by : smtv Desk | Mon, Jul 13, 2020, 12:52 PM

టెలికం యూజర్లకు ఝలక్.... ప్రీమియం ప్లాన్స్ బ్లాక్!!!

ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా యూజర్లకు ఝలక్. టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తాజాగా ఈ రెండు టెక్కోలకు షాకిచ్చింది. దీంతో ఇరు కంపెనీల కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడనుంది. ట్రాయ్ తాజాగా భారతీ ఎయిర్‌టెల్ ప్లాటినమ్, వొడాఫోన్ ఐడియా రెడ్‌ఎక్స్ ప్రీమియం ప్లాన్స్‌ను బ్లాక్ చేసింది.

వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ సంస్థలు రూల్స్‌ను అతిక్రమించాయని ట్రాయ్ తెలిపింది. ఈ కంపెనీలు ఈ ప్లాన్స్ ద్వారా కస్టమర్లకు హైస్పీడ్ డేటాను, ప్రియారిటీ సర్వీసులను అందజేస్తోందని పేర్కొంది. అందువల్ల ఇలాంటి ప్లాన్స్ రూల్స్‌ను అతిక్రమించినట్లేనని తెలిపింది. క్వాలిటీ ఆఫ్ సర్వీస్ నిబంధనలను ఈ ప్లాన్స్ అతిక్రమించాయని పేర్కొంది.

అయితే సీనియర్ టెలికం అనలిస్ట్ ఒకరు ఈ ప్లాన్స్ ఎలాంటి రూల్స్‌ను అతిక్రమించలేదని పేర్కొన్నారు. నెట్ న్యూట్రాలిటీకి సంబంధించి నిబంధనల అతిక్రమణ జరగలేదని తెలిపారు. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న కస్టమర్లకు మంచి సర్వీసులు అందించడంలో తప్పులేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ట్రాయ్ నిర్ణయంపై ఇంకా ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు ఇంకా స్పందించలేదు. భారతీ ఎయిర్‌టెల్ జూలై 6న ప్లాటినం కస్టమర్లు అందరికీ ఫాస్టర్ 4జీ డేటా స్పీడ్స్ అందిస్తున్నామని ప్రకటించింది. రూ.499 లేదా ఆపైన చెల్లించే పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

కాగా వొడాఫోన్ ఐడియా గతేడాది తన కస్టమర్ల కోసం రెడ్‌ఎక్స్ పేరుతో కొత్త ప్లాన్స్‌ను తీసుకువచ్చింది. 2019 నవంబర్‌లో ఈ రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి పోస్ట్‌పెయిడ్ రీచార్జ్ ప్లాన్స్. ధర రూ.999గా ఉంది. ఈ ప్లాన్స్ ఎంచుకున్న వారికి ప్రత్యేక సర్వీసులతో పాటు హైస్పీడ్ డేటా లభిస్తుంది.





Untitled Document
Advertisements