సిద్ధిపేట జిల్లాలో 100 పడకల కరోనా హాస్పిటల్

     Written by : smtv Desk | Mon, Jul 13, 2020, 01:09 PM

సిద్ధిపేట జిల్లాలో 100 పడకల కరోనా హాస్పిటల్

సిద్ధిపేట జిల్లా కేంద్రంలో 100 పడకల కరోనా వార్డు బుధవారం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆదివారం సాయంత్రం మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌ను సందర్శించిన ఆయన.. రోగులకు అందుతున్న చికిత్స, సౌకర్యాలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. కరోనా టెస్టులు చేయడానికి అవసరమైన పరికరాలు ఇంకా ఎన్ని రావాల్సి ఉంది.. వెంటిలేటర్లను బిగించారా? అనే విషయాలను మంత్రి ఆరా తీశారు.

ఈ సందర్భంగా ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న కరోనా బాధితులతో మంత్రి హరీశ్ రావు ఫోన్లో మాట్లాడారు. డాక్టర్లు బాగా చూసుకుంటున్నారా? భోజనం బాగుందా? అని ఆరా తీశారు. దీనికి పేషెంట్లు స్పందిస్తూ.. వైద్య సిబ్బంది బాగా చూసుకుంటున్నారని.. వేడి వేడి ఆహారం అందిస్తున్నారని చెప్పారు.

వేడి నీళ్లు ఇస్తున్నారని.. కషాయం, డ్రై ప్రూట్స్ అందజేస్తున్నారని.. ఓ పూట చికెన్‌తో భోజనం పెడుతున్నారని బాధితురాలు మంత్రికి తెలిపారు. టీ ఇస్తున్నారా అని మంత్రి ప్రశ్నించగా.. ఇవ్వడం లేదని... ఇస్తే బాగుంటుందని బాధితురాలు చెప్పింది. కరోనా లక్షణాలు ఉన్నాయా అని మంత్రి ప్రశ్నించగా.. దగ్గు వస్తోందని.. రుచి సరిగా తెలియడం లేదని బాధితురాలు చెప్పారు. మీకు ఏం కాదని భరోసా ఇచ్చిన మంత్రి.. డాక్టర్ల సూచనలను కచ్చితంగా పాటించాలని రోగులకు స్పష్టం చేశారు.





Untitled Document
Advertisements