స్థిరంగానే పెట్రోల్ ధర...డీజిల్ ధరదీ ఇదే దారి

     Written by : smtv Desk | Sat, Aug 01, 2020, 12:04 PM

స్థిరంగానే పెట్రోల్ ధర...డీజిల్ ధరదీ ఇదే దారి

దేశీ ఇంధన ధరలు నిలకడగానే కొనసాగాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈరోజు ఎలాంటి మార్పు లేదు. దీంతో హైదరాబాద్‌‌లో శనివారం ఇంధన ధరలు స్థిరంగానే ఉన్నాయి. లీటరు పెట్రోల్ ధర రూ.83.49 వద్ద నిలకడగానే ఉంది. డీజిల్ ధర కూడా రూ.80.14 వద్ద స్థిరంగానే కొనసాగుతోంది.

అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర రూ.85.21 వద్ద స్థిరంగానే కొనసాగుతోంది. డీజిల్‌ ధర కూడా రూ.81.31 వద్ద నిలకడగానే ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.84.82 వద్ద నిలకడగా ఉంది. డీజిల్ ధర రూ.80.94 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.


దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. పెట్రోల్ ధర రూ.80.43 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా స్థిరంగా రూ.73.56 వద్ద ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా ధరలు నిలకడగానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.87.19 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర రూ.80.11 వద్ద నిలకడగా కొనసాగుతోంది.


అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.90 శాతం పెరుగుదలతో 43.64 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 1.30 శాతం పెరుగుదలతో 40.44 డాలర్లకు ఎగసింది.

ఇకపోతే సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు.





Untitled Document
Advertisements