పెరుగుతూనే ఉన్న బంగార ధర...వెండిదీ ఇదే దారి

     Written by : smtv Desk | Sat, Aug 01, 2020, 01:09 PM

పెరుగుతూనే ఉన్న బంగార ధర...వెండిదీ ఇదే దారి

బంగారం ధర పరుగులు పెడుతోంది. భగభగమంటూ దూసుకెళ్తోంది. పసిడి ధర ఈరోజు కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ పైపైకి కదిలింది. బంగారం కొనే వారికి ఇది బ్యాడ్ న్యూస్. అమెరికా- చైనా ఉద్రిక్తతలు, కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితులు సహా గ్లోబల్ మార్కెట్‌లో బంగారం పరుగులు పెట్టడంతో మన దేశంలోనూ పసిడి పరుగులు పెడుతోంది.

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పైకి కదిలింది. దీంతో ధర రూ.55,820కు చేరింది. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.220 పెరుగుదలతో రూ.51,250కు ఎగసింది. పసిడి ధర పెరగడం ఇది వరుసగా 10వ రోజు కావడం గమనార్హం.

పసిడి ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.2000 పెరిగింది. దీంతో ధర రూ.65,000కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 1.49 శాతం పైకి కదిలింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1971 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 5.41 శాతం పెరుగుదలతో 24.62 డాలర్లకు ఎగసింది.

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పైకి కదిలింది. రూ.52,200కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.200 పెరుగుదలతో రూ.53,200కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.2000 పెరుగుదలతో రూ.65,000కు చేరింది.

ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.





Untitled Document
Advertisements