రుణ గ్రహీతలకు నిర్మలా సీతారామన్ శుభవార్త

     Written by : smtv Desk | Sat, Aug 01, 2020, 05:40 PM

రుణ గ్రహీతలకు నిర్మలా సీతారామన్ శుభవార్త

లోన్ తీసుకున్నారా? అయితే మీకు తీపికబురు అందబోతోంది. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల్లో మోదీ సర్కార్ లోన్ తీసుకున్న వారికి మరింత ఊరట కలిగించాలని భావిస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే దీనికి సంబంధించి పరోక్షంగా సంకేతాలిచ్చారు.

లోన్ మారటోరియం ఫెసిలిటీని మరి కొంత కాలం పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈఎంఐ మారటోరియం గడువును మరికొంత కాలం పొడిగించాలని యోచిస్తోంది. నిర్మలా సీతారామన్ పరోక్షంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

లోన్ ఈఎంఐ మారటోరియం అంశంపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)తో చర్చలు జరుగుతున్నాయిని నిర్మలా సీతారామన్ తెలిపారు. మారటోరియం పొడిగింపు అంశంపై త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తామని పేర్కొన్నారు. ఫిక్కీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆమె ఈ విషయాలను వెల్లడించారు.

కాగా కేంద్ర ప్రభుత్వం లోన్ మారటోరియం ఫెసిలిటీని మార్చి నెల నుంచి రుణ గ్రహీతలకు అందిస్తోంది. మోదీ సర్కార్ తొలిగా మూడు నెలలు ఈఎంఐ మారటోరియం ఆప్షన్ అందించింది. తర్వాత ఈ ఫెసిలిటీని మరో మూడు నెలలు పొడిగించింది. ఇప్పుడు మరోసారి ఈఎంఐ మారటోరియం గడువు పొడిగించాలని కేంద్రం భావిస్తోంది.





Untitled Document
Advertisements