శుభవార్త: దిగొచ్చిన బంగార ధర...తగ్గిన వెండి

     Written by : smtv Desk | Mon, Aug 10, 2020, 09:21 AM

శుభవార్త: దిగొచ్చిన బంగార ధర...తగ్గిన వెండి

సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తున్న పసిడి పరుగుకు బ్రేకులు పడ్డాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర ఈరోజు దిగొచ్చింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగే అంశమని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా కూడా దేశీ మార్కెట్‌లో పసిడి పడిపోవడం గమనార్హం. .
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 క్షీణించింది. దీంతో ధర రూ.58,690కు పడిపోయింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.400 క్షీణతతో రూ.53,800కు దిగొచ్చింది.

పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2310 పతనమైంది. దీంతో ధర రూ.74,200కు పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.8 శాతం పైకి కదిలింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 2034 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 2.69 శాతం పెరుగుదలతో 28.28 డాలర్లకు ఎగసింది.
ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి





Untitled Document
Advertisements