అందుబాటులోకి పీఎన్‌బీ కొత్త స్కీమ్ : సులభంగా రూ.5 లక్షల రుణం!

     Written by : smtv Desk | Mon, Aug 10, 2020, 12:45 PM

అందుబాటులోకి పీఎన్‌బీ కొత్త స్కీమ్ : సులభంగా రూ.5 లక్షల రుణం!

ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతున్నారా? కరోనా వైరస్ దెబ్బకి ఆదాయం లేకుండా పోయిందా? వీటిని ఎదుర్కొనేందుకు బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే ఏ బ్యాంక్‌లో రుణం పొందాలో తెలియడం లేదా? అయితే మీకు ఒక మంచి ఆప్షన్ అందుబాటులో ఉంది.

దేశీ రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) సరికొత్త స్కీమ్‌ను లాంచ్ చేసింది. దీని పేరు పీఎన్‌బీ వీవర్ ముద్రా పథకం (PNBWMS). ఈ స్కీమ్‌లో భాగంగా అర్హత కలిగిన వారు రూ.2 లక్షల వరకు రుణం పొందొచ్చు. నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా పీఎన్‌బీ ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.


పీఎన్‌బీ కొత్త స్కీమ్ ద్వారా మగం వేసే వారు రుణాలు పొందొచ్చు. ముద్రా స్కీ్మ్ లోని శిశు, కిశోర్ విభాగాల కింద లోన్ తీసుకోవచ్చు. రుణ మొత్తాన్ని మూలధన అవసరాల కోసం వెచ్చించొచ్చు. రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు రుణం లభిస్తుంది.

టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖతో చర్చించిన తర్వాతనే పీఎన్‌బీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మగం నేసే వారి కోసం కొత్త రుణ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. పట్టణ ప్రాంతాలు సహా గ్రామీణ ప్రాంతాల్లో మగం నేసే వారు ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.





Untitled Document
Advertisements