ధోనీ ఫామ్ గురించి మాకేమీ కంగారు లేదు! అతని బాధ్యతలు ఏంటో..? బాగా తెలుసు: CSK సీఈవో

     Written by : smtv Desk | Tue, Aug 11, 2020, 09:13 PM

ధోనీ ఫామ్ గురించి మాకేమీ కంగారు లేదు! అతని బాధ్యతలు ఏంటో..? బాగా తెలుసు: CSK సీఈవో

ఐపీఎల్ 2020 సీజన్ మరికొద్ది రోజుల్లోనే యూఏఈ వేదికగా ప్రారంభంకాబోతోంది. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఈ మెగాటోర్నీ జరుగుతుందని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేయగా.. ఆగస్టు 20 తర్వాత ఐపీఎల్ జట్లనీ అక్కడికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అన్ని జట్ల కంటే ముందుగానే చెన్నై సూపర్ కింగ్స్‌ టీమ్‌కి యూఏఈకి వెళ్లాలని ప్లాన్ చేసింది. కానీ.. కరోనా వైరస్ నేపథ్యంలో.. ఆగస్టు 20 తర్వాతే జట్లనీ అక్కడికి వెళ్లాలని బీసీసీఐ ఆదేశించడంతో చెన్నై టీమ్‌ ఫ్రాంఛైజీ వెనక్కి తగ్గింది. అయితే.. ఆ జట్టులోని క్రికెటర్లు మాత్రం ఇప్పటికే ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ మొదలెట్టేశారు.


చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఇటీవల రాంచీలోని క్రికెట్ స్టేడియంలో ఒక సెషన్‌పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు ఝార్ఖండ్ క్రికెట్ అసోషియేషన్ (జే‌ఏసీ) అధికారి ఒకరు తెలిపారు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కి దూరంగా ఉండిపోయిన ధోనీ.. ఐపీఎల్ 2020 సీజన్‌లో రాణించడం ద్వారా మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్నాడు. కానీ.. ధోనీ కెరీర్ ఇప్పటికే ముగిసిపోయిందని.. ఐపీఎల్ 2020 సీజన్ అతని కెరీర్‌లో ఆఖరి టోర్నీ అంటూ కొంత మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

ధోనీ రిటైర్మెంట్ రూమర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ తాజాగా మాట్లాడుతూ ‘‘ఐపీఎల్ 2020, 2021 సీజన్‌లో ధోనీ ఆడతాడని మేము ముందే ఊహించాం. నా అంచనా ప్రకారం 2022 ఐపీఎల్ సీజన్‌లోనూ ధోనీ ఆడతాడు. ఝార్ఖండ్‌లో ధోనీ బ్యాటింగ్ ప్రాక్టీస్ గురించి మీడియా ద్వారానే నాకు తెలిసింది. అయినా.. మా కెప్టెన్ ఫామ్ గురించి మాకేమీ కంగారు లేదు. ధోనీకి అతని బాధ్యతలు ఏంటో..? బాగా తెలుసు’’ అని వెల్లడించాడు.





Untitled Document
Advertisements