సుశాంత్‌ను స్టన్ గన్‌తో హత్య చేశారు: ఎంపీ

     Written by : smtv Desk | Wed, Aug 12, 2020, 05:29 PM

సుశాంత్‌ను స్టన్ గన్‌తో హత్య చేశారు: ఎంపీ

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసు దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుశాంత్ అనుమానాస్పద మృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ సింగ్‌ను స్టన్ గన్‌తో హత్య చేశారన్నారు ఎంపీ. అందుకే ఈ కేసును సీబీఐతోపాటు ఎన్ఐఏతో కూడా దర్యాప్తు చేయాలని సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. సాధారణంగా స్టన్ గన్‌లను మనుషులను కొంతసేపు పారాలైజ్ చేసేందుకు ఉపయోగిస్తారని.. అయితే సుశాంత్‌ను కూడా అదే గన్‌తో పారాలైజ్ చేసి తరువాత అతనికి ఉరి వేసి చంపి ఉంటారని ఆయన అన్నారు. సుశాంత్ మెడపై ఎడమ వైపు ఉన్న ముద్రలు స్టన్ గన్‌తో పడినవే అని అన్నారు.

అయితే సుబ్రహ్మణ్య స్వామి పెట్టిన పోస్టుతో పాటు ఆయన వ్యాఖ్యల్ని పలువురు డాక్టర్లు కూడా సమర్థిస్తున్నారు. స్టన్ గన్‌తో సరిగ్గా శరీరంపై అలాంటి ముద్రలే పడతాయంటున్నారు. అందుకే సుశాంత్ ను స్టన్ గన్‌తో చంపి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇక ఆ గన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు తెచ్చారు.. అనే వివరాలపై ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. కాగా ఇప్పటికే రియా చక్రవర్తి, ఆమె సోదరుడికి చెందిన ఫోన్లు, ట్యాబ్‌లు, ఇతర డివైస్‌లను ఈడీ సీజ్ చేసింది.

సుశాంత్ అకౌంట్లలో ఉన్న రూ.15 కోట్లు ఏమైపోయాయి అనే నేపథ్యంలో ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే పలుసార్లు రియా, ఆమె సోదరుడు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. మరోవైపు సుశాంత్ సింగ్ మృతిపై ఆయన తండ్రి రియాపై బీహార్‌లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పాట్నా పోలీసులు దర్యాప్తు చేస్తున్న సుశాంత్ కేసును ముంబైకి బదిలీ చేయాలని రియా చక్రవర్తి సుప్రీంను ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టులో గురువారం వరకు విచారణను వాయిదా వేసింది. అన్ని వర్గాల వాదనలను విన్న కోర్టు తీర్పును గురువారానికి రిజర్వ్ చేసింది.





Untitled Document
Advertisements