కరోనా వైరస్ నుంచి కోలుకున్న దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి

     Written by : smtv Desk | Wed, Aug 12, 2020, 08:02 PM

కరోనా వైరస్ నుంచి కోలుకున్న దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా కరోనా నెగిటివ్ వచ్చినట్టు రాజమౌళి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రెండు వారాల పాటు పూర్తిగా క్వారంటైన్‌లో ఉన్నామని, ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవని రాజమౌళి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. పరీక్షలు చేయించుకున్నామని, ఇంట్లో అందరికీ నెగిటివ్ వచ్చిందని స్పష్టం చేశారు. అయితే, తక్షణమే తాము ప్లాస్మా దానం చేయడం వీలుపడదని చెప్పారు. ప్లాస్మా దానం కోసం కావాల్సిన యాంటీబాడీస్ అభివృద్ధి కావడానికి మూడు వారాలు వేచి చూడాలని డాక్టర్ చెప్పినట్టు రాజమౌళి వెల్లడించారు.

తనకు, తన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు జులై 29న రాజమౌళి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం కాస్త జ్వరం వచ్చిందని, దానికదే తగ్గిపోయిందని.. అయినప్పటికీ తాము కరోనా పరీక్ష చేయించుకున్నామని రాజమౌళి ఆరోజు వెల్లడించారు. కొవిడ్-19 పాజిటివ్ రావడంతో డాక్టర్ల సూచన మేరకు తామంతా హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయామని చెప్పారు. తమకు ఎలాంటి లక్షణాలు లేవన్నారు. అంతా బాగానే ఉన్నామని, అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్లాస్మా దానం చేయనున్నట్టు ప్రకటించారు.

అయితే, ఇప్పుడు రాజమౌళి కుటుంబం ప్లాస్మా దానం చేయాలంటే మరో మూడు వారాలు ఆగాల్సిందే. వారి శరీరాల్లో యాండీబాడీస్ బాగా డెవలప్ అయితే ప్లాస్మాను దానం చేయొచ్చు. ఇదిలా ఉంటే, RRR నిర్మాత డి.వి.వి.దానయ్యకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. కాగా, కరోనా కారణంగా RRR షూటింగ్ తాత్కాలికంగా ఆగిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి పూర్తిగా పోయేంత వరకు ఈ షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే 70 శాతం మేర షూటింగ్ పూర్తిచేసినట్టు సమాచారం.





Untitled Document
Advertisements