రైతుల కోసం కొత్త స్కీమ్...రూపాయి చెల్లించకుండానే రూ.లక్ష వరకు ప్రయోజనం

     Written by : smtv Desk | Fri, Aug 14, 2020, 03:47 PM

రైతుల కోసం కొత్త స్కీమ్...రూపాయి చెల్లించకుండానే రూ.లక్ష వరకు ప్రయోజనం

రైతుల కోసం కొత్త స్కీమ్ అందుబాటులోకి వచ్చింది. అకాల వర్షాలు, కరవు, వరదల కారణంగా పంట నష్టం వాటిలితే వారికి ప్రయోజనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ఆవిష్కరించింది. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే వారికి పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. అయితే ఇది మన రాష్ట్రంలో కాదు. గుజరాత్‌ ప్రభుత్వం ఈ పథకాన్ని తెచ్చింది.

గుజరాత్ ప్రభుత్వం కిసాన్ సహాయ యోజన పేరుతో రైతుల కోసం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్‌కు బదులుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను అన్నదాతలకు అందిస్తోంది. ఖరీఫ్ పంటకు సంబంధించి 56 లక్షల మంది రైతులకు కొత్త స్కీమ్ ద్వారా ప్రయోజనం కల్పిస్తామని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తెలిపారు.

జూన్ నుంచి నవంబర్ మధ్యకాలంలో వరదలు, అకాల వర్షాలు కారణంగా పంట దెబ్బతింటే రైతులకు పరిహారం అందిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పరిహారం కోసం రైతులు ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. రూ.లక్ష వరకు పరిహారం అందిస్తమని తెలిపింది. ఏకరాకు రూ.25 వరకు పరిహారం లభిస్తుందని పేర్కొంది.

ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ఏడాది పంట బీమా కోసం ఎక్కువగా డిమాండ్ చేశాయని, వారి ప్రతిపాదనను ఓకే చేస్తే ప్రభుత్వం ఆ కంపెనీలకు రూ.4,500 కోట్లు చెల్లించాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అందుకే వారి ప్రతిపాదనను తిరస్కరించామని, కొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించింది. కొత్త వెబ్‌సైట్ అందుబాటులోకి తీసుకువస్తామని, దీని ద్వారా రైతులు పథకంలో చేరొచ్చని పేర్కొంది.





Untitled Document
Advertisements