ఇంగ్లాండ్ పర్యటనకి ఆస్ట్రేలియా గ్రీన్‌సిగ్నల్

     Written by : smtv Desk | Fri, Aug 14, 2020, 04:11 PM

ఇంగ్లాండ్ పర్యటనకి ఆస్ట్రేలియా గ్రీన్‌సిగ్నల్

ఐపీఎల్ 2020 సీజన్ ముంగిట ఇంగ్లాండ్ పర్యటనకి ఆస్ట్రేలియా వెళ్లబోతోంది. ఇంగ్లాండ్‌తో సెప్టెంబరు 4 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు సిరీస్‌ని ఆస్ట్రేలియా ఆడబోతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనుండగా.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ఆఖరి మ్యాచ్ సెప్టెంబరు 16న ముగియనుంది. ఈ నేపథ్యంలో.. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకి ఈ రెండు జట్ల ఆటగాళ్లు దూరంగా ఉండే అవకాశం ఉంది.



సౌథాంప్టన్ వేదికగా సెప్టెంబరు 4, 6, 8న వరుసగా మూడు టీ20లు జరగనుండగా.. ఆ తర్వాత మాంచెస్టర్‌లో సెప్టెంబరు 11, 13, 16న మూడు వన్డేల జరగనున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో.. పూర్తి బయో- సెక్యూర్ వాతావరణంలో ఈ సిరీస్‌ని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్వహించనుండగా.. సౌథాంప్టన్, మాంచెస్టర్ స్టేడియాలు మాత్రమే ఆ దేశంలో హోటల్స్‌కి అత్యంత సమీపంలో ఉన్నాయి. దాంతో.. ఈ రెండు వేదికల్లో గత నెలన్నరగా అంతర్జాతీయ మ్యాచ్‌లను ఈసీబీ నిర్వహిస్తోంది.

ఇంగ్లాండ్‌తో వన్డే, టీ20 సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) 21 మందితో కూడిన జట్టుని కూడా ఈరోజు ప్రకటించేసింది. ఇందులో ముగ్గురు తొలిసారి ఆస్ట్రేలియా టీమ్‌కి ఆడబోతున్నారు.

ఆస్ట్రేలియా జట్టు: అరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబాట్, అస్గన్ అగర్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్), జోష్ హేజిల్‌వుడ్, మార్కస్ లబుషేన్, నాథన్ లయన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, రిలీ మేరాదిత్, జోష్ ఫిలిప్పీ, డేనియల్ సామ్స్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవ్‌స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టాయినిస్, ఆండ్రూ టై, మాథ్యూ వెడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్





Untitled Document
Advertisements