నిహారిక నిశ్చితార్థానికి పవన్ రాకపోవడానికి కారణం!?

     Written by : smtv Desk | Fri, Aug 14, 2020, 04:53 PM

నిహారిక నిశ్చితార్థానికి పవన్ రాకపోవడానికి కారణం!?

మెగా డాటర్ నిహారిక-చైతన్య జొన్నలగడ్డ నిశ్చితార్థం గురవారం నాడు హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు కుటుంబ పెద్దలుగా దగ్గరుండి వేడుకను నిర్వహించగా.. మెగా హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్, కళ్యాణ్ దేవ్‌లు సందడి చేశారు. అయితే ఎంతమంది మెగా హీరోలు ఉన్నా.. మెగా ఫ్యాన్స్ చూపు పవర్ స్టార్

పవన్ కళ్యాణ్ కోసం చూస్తూనే ఉంటుంది కాబట్టి.. ఈ వేడుకలో పవర్ స్టార్ కనిపించకపోవడం లోటుగానే అనిపించింది.

అయితే ఇటీవల పవన్ కళ్యాణ్.. తన ప్రియ భక్తుడు, యంగ్ హీరో నితిన్ వివాహానికి త్రివిక్రమ్‌తో సహా హాజరై కొత్త దంపతుల్ని ఆశీర్వదించారు. అయితే తన అన్న కూతురు.. పైగా జనసేన ఎంపీ అభ్యర్థి అయిన నాగబాబు డాటర్ నిశ్చితార్థ వేడుకలో పవన్ కనిపించకపోయే సరికి రకరకాల పుకార్లు మొదలయ్యాయి.

ఇంతకీ పవన్ కళ్యాణ్ ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరు కాకపోవడానికి ఫ్యామిలీలో విభేదాలో.. నాగబాబుతో వైరమో కాదని.. ఆయన చాతుర్మాస దీక్షలో ఉండటమే అసలు కారణం అని తెలుస్తోంది. ఈ దీక్షకు సంబంధించిన హోమం, పూజలు ఉండటంతో పవన్ కళ్యాణ్.. నిహారిక నిశ్చితార్థ వేడుకకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాత్రి 8 గంటలకు నిహారిక నిశ్చితార్థం జరగ్గా.. అంతకు ముందే కాబోయే దంపతుల్ని పవన్ కళ్యాణ్ ఆశీర్వదించినట్టు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత కారణాలతో రాలేకపోయినా అతని భార్య, పిల్లలు కనిపించినా బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక పవన్ దీక్ష విషయానికి వస్తే.. ప్రజల క్షేమం, ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సును ఆకాంక్షిస్తూ పవన్‌ కళ్యాణ్.. చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు. నాలుగు మాసాలపాటు పవన్‌ కల్యాణ్‌ దీక్ష కొనసాగుతుండగా.. జూలై 1 నుంచి ఈ దీక్ష ప్రారంభమైంది. చాతుర్మాస్య దీక్షలో ఉన్ననంత కాలం పవన్ కళ్యాణ్ మాంసాహారానికి దూరంగా ఉంటూ.. మితంగా సాత్వికాహారాన్ని మాత్రమే స్వీకరిస్తారు. అది కూడా ఒక్కపూట మాత్రమే ఆహారం తీసుకుంటూ.. సూర్యాస్తమయం అనంతరం కొద్దిగా పాలు, పండ్ల ఆహారంగా తీసుకుంటారన్నారు. అయితే దీక్ష విరమణ రోజున హోమాన్ని నిర్వహించి.. పూర్ణాహూతితో దీక్షను విరమించనున్నారు.





Untitled Document
Advertisements