పిల్లలకు ఆర్థిక భద్రత అందించాలా?అయితే ఈ స్కీమ్‌లో డబ్బులు పెట్టండి

     Written by : smtv Desk | Sat, Sep 19, 2020, 05:42 PM

పిల్లలకు ఆర్థిక భద్రత అందించాలా?అయితే ఈ స్కీమ్‌లో డబ్బులు పెట్టండి

తల్లిదండ్రులు పిల్లలకు మంచి భవిష్యత్ అందించాలని కోరుకుంటారు. ఇందుకు ధనవంతులు, పేదలు అని వ్యత్యాసంన లేదు. అమ్మనాన్నలు ఎవరైనా పిల్లలు బాగుండాలని ఆశిస్తారు. పిల్లలకు బంగారం లాంటి భవిష్యత్ కానుకగా అందించాలని భావిస్తే.. వారి పేరుపై డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాలి. ఇలా చేయడం వల్ల పిల్లల ఆర్థిక లక్ష్యాలకు డబ్బులు చేతికి వస్తాయి. ఉన్నత చదువు, పెళ్లి వంటి వాటిని ఈ డబ్బులు ఉపయోగపడతాయి.

పిల్లల పేరుపై డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి చాలా స్కీమ్స్, ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఒకటి. పీపీఎఫ్‌ అకౌంట్‌ను పిల్లల పేరుపై కూడా ప్రారంభించొచ్చు. ఇది దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్ సాధనం. ప్రస్తుతం ఈ ఖాతాపై 7.1 శాతం వడ్డీ వస్తోంది. పీపీఎఫ్ అకౌంట్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రతి నెలా ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ ఉంది.

మీరు ఇద్దరు పిల్లలు ఉన్నారని భావిస్తే.. మీరు ఇద్దరి పేర్లపై పీపీఎఫ్ ఖాతాలను తెరిచి సంవత్సరానికి రూ.3 లక్షలు వాటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. 15 ఏళ్ల తర్వాత మీరు ఈ అకౌంట్లలోని డబ్బులను పూర్తిగా వెనక్కి తీసుకోవచ్చు. అవసరం అనుకుంటే ఐదేళ్ల చొప్పున మెచ్యూరిటీ కాలాన్ని పొడిగించుకోవచ్చు.

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా డబ్బులు పెట్టొచ్చు. ఇతర ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్‌తో పోలిస్తే ఇవి దీర్ఘకాలంలో అధిక రాబడి అందించాయి. ప్రతి నెలా SIP రూపంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీకు పదేళ్ల తర్వాత డబ్బులు అవసరం అనుకుంటే పిల్లల పేరుపై లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో డబ్బులు పెట్టొచ్చు.

సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకం కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ స్కీమ్‌లో ఆడ పిల్లలు మాత్రమే చేరేందుకు అవకాశముంది. పదేళ్లలోపు అమ్మాయిల పేరుపై ఖాతా తెరవొచ్చు. ఇందులో కూడా ఏడాదికి రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. రూ.250 ఇన్వెస్ట్ చేసిన సరిపోతుంది. 15 ఏళ్లు ఇన్వెస్ట్ చేయాలి. స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు.





Untitled Document
Advertisements