ధోనీ ఈజ్ బ్యాక్!

     Written by : smtv Desk | Sat, Sep 19, 2020, 07:07 PM

ధోనీ ఈజ్ బ్యాక్!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌లో బరిలో దిగుతున్నాడు. గత ఏడాది జులైలో వరల్డ్ కప్ తర్వాత క్రికెట్‌కు దూరమైన ధోనీ... చాలా కాలంపాటు సైలెంట్‌గా ఉండిపోయాడు. అనంతరం ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఆగస్టు 15న ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా తన రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. సాయంత్రం 19.29 (7 గంటల 29 నిమిషాల) నుంచి రిటైర్ అయినట్లు భావించాలని అభిమానులను కోరాడు.

సాయంత్రం 7.29 గంటలకు రిటైర్ అయినట్లు భావించాలని కోరిన ధోనీ.. ఐపీఎల్‌లో సరిగ్గా 7 గంటల 30 నిమిషాలకు మైదానంలో బరిలో దిగుతున్నాడు. దీంతో ఒక్క నిమిషం అంటూ ధోనీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. రిటైర్మెంట్ నుంచి రీ-ఎంటర్‌టైన్మెంట్ చేయడానికి మహీ వస్తున్నాడంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గత సీజన్లతో పోలిస్తే ఈ ఏడాది ధోనీ చాలా రిలాక్స్‌డ్‌గా కనిపిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పడంతో ఐపీఎల్‌లో మాత్రమే ధోనీ ఆటను చూసే వీలుంది. మహీ కూడా ఫోకస్ పెట్టి టోర్నీ ఆడటానికి అవకాశం ఉంది. రైనా, హర్భజన్ లీగ్‌కు దూరమైనా.. ఆ ప్రభావం జట్టుపై కనిపించకుండా ధోనీ చూస్తాడనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈసారి ధోనీ బ్యాట్‌తో సత్తా చాటతాడని.. సూపర్ కింగ్స్ కప్ కొడుతుందని చెన్నై ఫ్యాన్స్ ఆశాభావంతో ఉన్నారు.





Untitled Document
Advertisements