పంజాబ్‌‌తో ఈరోజు యువ ఢిల్లీ ఫైట్

     Written by : smtv Desk | Sun, Sep 20, 2020, 03:33 PM

పంజాబ్‌‌తో ఈరోజు యువ ఢిల్లీ ఫైట్

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా హిట్టర్లతో నిండిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ని ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ ఢీకొట్టబోతోంది. ఐపీఎల్ 2019 సీజన్‌లో రెండు మ్యాచ్‌ల్లో తలపడిన పంజాబ్, ఢిల్లీ.. చెరో మ్యాచ్‌‌లో గెలుపొందాయి. అయితే.. గత సీజన్లతో పోలిస్తే ఈసారి రెండు జట్లు మంచి సమతూకంతో కనిపిస్తున్నాయి.

పంజాబ్‌‌ని ఈ ఏడాది కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ నడిపించబోతుండగా.. క్రిస్‌గేల్, గ్లెన్ మాక్స్‌వెల్, నికోలస్ పూరన్ రూపంలో ఆ జట్టులో పవర్ హిట్టర్లు ఉన్నారు. ఇక బౌలింగ్‌ విభాగం కూడా మహ్మద్ షమీ, షెల్డన్ కాట్రెల్, గౌతమ్‌‌తో మెరుగ్గానే ఉన్నా.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోలిస్తే పంజాబ్ బౌలింగ్ కాస్త బలహీనమనే చెప్పాలి.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో యువ క్రికెటర్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. పృథ్వీ షా, సిమ్రాన్ హిట్‌మెయర్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్‌‌లతో మిడిలార్డర్ బలోపేతంగా కనిపిస్తుండగా.. ఇషాంత్ శర్మ, కగిసో రబాడ, కీమో పాల్, అశ్విన్‌తో బౌలింగ్ విభాగం కూడా మంచి సమతూకంతో ఉంది. గత ఏడాది ప్లేఆఫ్‌కి చేరి.. టైటిల్‌కి రెండు అడుగుల దూరంలో నిలిచిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.





Untitled Document
Advertisements