రూ.600 పడిపోయిన వెండి...పెరిగిన బంగారం ధర

     Written by : smtv Desk | Mon, Sep 21, 2020, 02:03 PM

రూ.600 పడిపోయిన వెండి...పెరిగిన బంగారం ధర

పసిడి పరుగులు పెడుతూనే వస్తోంది. బంగారం ధర మళ్లీ క్రమంగా పైకి కదులుతోంది. బంగారం ధరఈరోజు కూడా పెరిగింది. పసిడి పైకి కదలడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గినా కూడా దేశీ మార్కెట్‌లో పసిడి పైకి కదలడం గమనార్హం. బంగారం పెరిగితే వెండి మాత్రం పడిపోయింది.

హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.210 పైకి కదిలింది. దీంతో ధర రూ.54,060కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.210 పెరిగింది. దీంతో ధర రూ.49,580కు చేరింది.

పసిడి ధర పెరిగితే.. వెండి ధర మాత్రం పడిపోయింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.600 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.67,900కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.14 శాతం తగ్గుదలతో 1959 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.36 శాతం తగ్గుదలతో 27.03 డాలర్లకు క్షీణించింది.

ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.





Untitled Document
Advertisements