ఆరెంజ్ ఆర్మీ పూర్తి వివరాలు...అదొక్కటే మైనస్

     Written by : smtv Desk | Mon, Sep 21, 2020, 03:12 PM

ఆరెంజ్ ఆర్మీ పూర్తి వివరాలు...అదొక్కటే మైనస్

2016 సీజన్లో ఐపీఎల్ టైటిల్ నెగ్గిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. మరోసారి వార్నర్ కెప్టెన్సీలో కప్ కొట్టాలని ఆరాటపడుతోంది. ఈ సీజన్లో సమతూకం ఉన్న జట్లలో సన్‌రైజర్స్ ఒకటి. ప్రతి ఐపీఎల్ ఎడిషన్‌లో అండర్ డాగ్‌గా బరిలో దిగుతున్నప్పటికీ.. వరల్డ్ క్లాస్ టాప్ ఆర్డర్.. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లు ఉన్న ఈ జట్టు మెరుగైనన ప్రదర్శన చేస్తోంది. 2013 నుంచి 2019 మధ్య ఏడు సీజన్లలో ఐదుసార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకోగా ఓసారి కప్ కొట్టడంతోపాటు 2018లో రన్నరప్‌గా నిలిచింది. 2014, 2015ల్లో మాత్రమే సన్‌రైజర్స్ లీగ్ దశలో నిష్క్రమించింది.

ప్రతి సీజన్లోనూ సన్‌రైజర్స్‌కు శుభారంభాలు ఇస్తోన్న వార్నర్.. గత సీజన్లో జానీ బెయిర్‌స్టోతో కలిసి అదరగొట్టాడు. ఈ జోడి 2019లో అద్భుతంగా రాణించింది. బౌలింగ్‌లో రషీద్ ఖాన్ సత్తా చాటుతున్నాడు. విదేశీ ప్లేయర్స్ కోటాలో నాలుగో స్థానం కోసం కేన్ విలియమ్సన్, మహ్మద్ నబీ మధ్య పోటీ ఉంది. యూఏఈలోని స్పిన్ పరిస్థితుల దృష్ట్యా నబీకే ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కే ఛాన్స్ ఉంది. ఒకవేళ బెయిర్‌స్టో విఫలమైతే.. విలియమ్సన్ తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.

సన్‌రైజర్స్‌కు సెంటీమెంట్ కలిసొస్తుందా..?: సమయం ఎక్స్‌క్లూజివ్
మిడిలార్డర్ బలంగా లేకపోవడంతోపాటు.. భారత ఆటగాళ్లలో తగినంత అనుభవం లేకపోవడం సన్‌రైజర్స్ బలహీనత. ఐపీఎల్ నిబంధనల ప్రకారం జట్టులోని 11 మంది ఆటగాళ్లలో ఏడుగురు స్వదేశీ క్రికెటర్లు ఉంటారు. కానీ మనీష్ పాండే, భువనేశ్వర్ కుమార్ మినహా తుది జట్టులో చోటు దక్కించుకునే మిగతా ఐదుగురు ఆటగాళ్లకు తగినంత అనుభవం లేదు. వృద్ధిమాన్ సాహా, విజయ్ శంకర్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, షాబాజ్ నదీమ్, బసీల్ థంపీ తదితర భారత ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పటికీ వీరు ఒంటి చేత్తో గెలిపించే మ్యాచ్ విన్నర్లు కాదు.

సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మెన్: డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, విరాట్ సింగ్, ప్రియమ్ గార్గ్, అబ్దుల్ సమద్‌. ఈ సీజన్లో పాండేతోపాటు.. యువ బ్యాట్స్‌మెన్ రాణిస్తేనే మిడిలార్డ్ సమస్య తీరుతుంది.

బౌలర్లు: భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, బిల్లీ స్టాన్లేక్, నటరాజన్, అభిషేక్ శర్మ, షాబాద్ నదీమ్.

ఆల్‌రౌండర్లు: మహ్మద్ నబీ, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, మిచెల్ మార్ష్, ఫాబిన్ అలెన్, సంజయ్ యాదవ్.

వికెట్ కీపర్లు: జానీ బెయిర్ స్టో, వృద్ధిమాన్ సాహా, శ్రీవాత్స్ గోస్వామి.

ఐపీఎల్ 2020కి ముందు సన్‌రైజర్స్ షకీబ్ అల్ హసన్ (ఏడాదిపాటు నిషేధం ఎదుర్కొంటున్నాడు), దీపక్ హుడా, మార్టిన్ గప్టిల్, రికీ భుయ్, యూసుఫ్ పఠాన్‌ను రిలీజ్ చేసింది.

ఐపీఎల్ 2020కి ముందు వేలంలో మిచెల్ మార్ష్ (రూ. 2 కోట్లు), ప్రియమ్ గార్గ్ (రూ.1.9 కోట్లు), విరాట్ సింగ్ (రూ.1.9 కోట్లు), ఫ్యాబిన్ అలెన్ (రూ.50 లక్షలు), బి.సందీప్ (రూ.20 లక్షలు), సంజయ్ యాదవ్ (రూ.20 లక్షలు), అబ్దుల్ సమద్ (రూ.20 లక్షలు) కొనుగోలు చేసింది.





Untitled Document
Advertisements