ఆర్సీబీకి ఒక్క విజయం...ధోనీ, రోహిత్ సరసన కోహ్లి!

     Written by : smtv Desk | Mon, Sep 21, 2020, 04:45 PM

ఆర్సీబీకి ఒక్క విజయం...ధోనీ, రోహిత్ సరసన కోహ్లి!

ఐపీఎల్‌లో మూడో సమరానికి వేళయ్యింది. సోమవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధిస్తే.. ధోనీ, రోహిత్ సరసన కోహ్లి చోటు దక్కించుకుంటాడు. ఐపీఎల్‌లో 50 విజయాలు సాధించిన నాలుగో కెప్టెన్‌గా రికార్డ్ క్రియేట్ చేస్తాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ ధోనీ (105) అనే సంగతి తెలిసిందే. ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ వంద విజయాలను నమోదు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రెండుసార్లు టైటిల్ అందించిన గౌతమ్ గంభీర్ 71 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు.

60 విజయాలతో రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. 2011 నుంచి ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న కోహ్లి.. 100 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేయగా.. 49 మ్యాచ్‌ల్లో బెంగళూరు విజయం సాధించింది. రోహిత్ నాలుగుసార్లు, ధోనీ మూడుసార్లు, గంభీర్ రెండుసార్ల చొప్పున ఐపీఎల్ టైటిల్ గెలవగా.. కోహ్లి సేన మాత్రం ఇప్పటి వరకూ కప్ గెలవలేకపోయింది.

గతంతో పోలిస్తే బెంగళూరు జట్టు బ్యాలెన్స్‌డ్‌గా కనిపిస్తోంది. ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌తోపాటు పేసర్ డెల్ స్టెయిన్‌, ఫించ్ హిట్టర్ ఆరోన్ ఫించ్ ఆర్సీబీలో చేరారు. దీంతో ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలనే కసితో కోహ్లి సేన బరిలో దిగుతోంది.





Untitled Document
Advertisements