ఐపీఎల్ 2020 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం రాత్రి జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దుబాయ్ స్టేడియం పరిసరాల్లో రాత్రి మంచు కురిసే అవకాశం ఉండటం.. పిచ్ ఛేదనకి అనుకూలంగా కనిపించడంతో వార్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల తర్వాత సన్రైజర్స్ని కెప్టెన్గా డేవిడ్ వార్నర్ నడిపిస్తున్నాడు. 2018లో బాల్ టాంపరింగ్ కారణంగా నిషేధం పడటంతో టోర్నీకి దూరమైన డేవిడ్ వార్నర్.. 2019కి తిరిగి జట్టులోకి వచ్చినా.. అతనికి కెప్టెన్సీ దక్కలేదు. కేన్ విలియమ్సన్ ఆ రెండు సీజన్లకి కెప్టెన్గా ఉన్నాడు.
ఐపీఎల్ 2019 సీజన్లో ఈ రెండు జట్లు రెండు సార్లు తలపడగా.. చెరొక మ్యాచ్లో గెలుపొందాయి. అయితే.. అప్పట్లో ఫస్ట్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు జానీ బెయిర్ స్టో (114), డేవిడ్ వార్నర్ (100) శతకాలు బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేయగా.. ఛేదనలో బెంగళూరు పేలవంగా 112 పరుగులకే ఆలౌటైంది. ఇక రెండో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని బెంగళూరు 19.2 ఓవర్లలోనే 178/6తో ఛేదించింది. ఈ రెండు మ్యాచ్ల్లోనూ విరాట్ కోహ్లీ 3, 16 పరుగులతో నిరాశపరిచాడు.
#SRH Captain @davidwarner31 wins the toss and elects to field first against #RCB.
mdash; IndianPremierLeague (@IPL) September 21, 2020
Follow the game here - https://t.co/iJSJnKDLto #Dream11IPL #SRHvRCB pic.twitter.com/wpGvBhG7BK