బాలీవుడ్‌ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ జయ

     Written by : smtv Desk | Mon, Sep 21, 2020, 09:48 PM

బాలీవుడ్‌ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన సుశాంత్ సింగ్  మాజీ మేనేజర్ జయ

బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసుతో బయటపడిన డ్రగ్స్‌ వ్యవహారంలో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇ‍ప్పటికే సుశాంత్‌ ప్రియురాలు, నటి రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడు షోవిక్‌ సహా ఇద్దరు డ్రగ్‌ డీలర్లను నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలకంగా రియా వాట్సాప్ చాటింగ్, ఆమె కాల్‌ లిస్ట్‌‌ ఆధారంగా లోతుగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే సుశాంత్ మాజీ మేనేజర్ జయ సాహో సోమవారం విచారణకు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మరిన్ని డ్రగ్ లింకులు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

బాలీవుడ్‌లో చాలామంది నటులు తనను సీబీడీ ఆయిల్(గంజాయి ఆకులు నుంచి తీసిన ద్రవం) సరఫరా చేయాలని కోరినట్లు ఆమె తెలిపారు. ఇందుకోసం ఓ వాట్సాప్ గ్రూప్ కోసం క్రియేట్ చేసినట్లు చెప్పింది. డ్రగ్స్ సరఫరాలో రియాతో పాటు జయ కూడా మీడియేటర్‌గా వ్యవహరించినట్ల తేలడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకు సీబీడీ ఆయిల్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీస్తున్నారు.

దీంతో పాటు ఆమె ఫోన్లో ఎస్‌ఎల్‌బీ, అమిత్ వంటి పేర్లతో ఉన్న కాంటాక్ట్‌ గురించి తెలుసుకుంటున్నారు. ఈ కేసులో నిందితురాలైన రియా చక్రవర్తి.. విచారణలో భాగంగా సారా అలీఖాన్, రకుల్‌ ప్రీత్‌సింగ్, శ్రద్ధా కపూర్ వంటి పేర్లు బయటపెట్టడంతో పెద్ద దుమారమే రేగింది. దీంతో ఎన్‌సీబీ అధికారులు విచారణ హాజరు కావాలంటే కొందరికి ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.





Untitled Document
Advertisements