నీటిలో కొట్టుకుపోయిన జవాన్ల బస్సు

     Written by : smtv Desk | Mon, Sep 21, 2020, 09:50 PM

నీటిలో కొట్టుకుపోయిన జవాన్ల బస్సు

ఛత్తీస్‌గఢ్‌లో జవాన్లకు ఘోర ప్రమాదం తప్పింది. 30 జవాన్లతో వస్తున్న ఓ బస్సు వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. వంతెన పైనుంచి కిందకి జారిపోయింది. అయితే.. ఈ ప్రమాదం నుంచి జవాన్లందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని మల్కన్‌గిరి - ఒడిశాలోని బీజాపూర్రహదారిపై సోమవారం (సెప్టెంబర్ 21) మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

మావోయిస్టుల కోసం జవాన్లు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డిస్ట్రిక్ట్రిజర్వ్‌డ్ గ్రూప్(డీఆర్‌జీ)కు చెందిన 30 మంది జవాన్లు.. నక్సల్స్ఆపరేషన్నిర్వహించి తిరిగివస్తున్న సమయంలో ఆ మార్గంలో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ఆర్మీ బస్సు అదే మార్గం ద్వారా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.







Untitled Document
Advertisements