ఆసిఫాబాద్: డ్రోన్ కెమెరాలతో మావోల వేట!

     Written by : smtv Desk | Tue, Sep 22, 2020, 11:18 AM

ఆసిఫాబాద్: డ్రోన్ కెమెరాలతో మావోల వేట!

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మావోల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. కాగజ్ నగర్ మండలం కడంబ ఎన్ కౌంటర్ తర్వాత మూడో రోజు కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. డ్రోన్ కెమెరాల సాయంతో అడవుల్లో దాక్కొన్న మావోయిస్టుల కోసం వేట మొదలు పెట్టారు. ఈ డ్రోన్ ఆపరేషన్ ను స్వయంగా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. గ్రేహౌండ్స్ బలగాలు, పోలీసులు నదీ పరివాహక ప్రాంతాలు, దట్టమైన అడవులను డ్రోన్ లతో జల్లెడ పడుతున్నారు

మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు అడేల్లు అలియాస్ భాస్కర్ టార్గెట్‌గా కూంబింగ్ కొనసాగుతోంది. పెంచకల్ పెట్ (మండలం) సిద్దేశ్వర గుట్ట లోడ్పెల్లి చింతనమనేపల్లి గూడెం ప్రాణహిత నదీ సరిహద్దు పరివాహక ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.
రెండు రోజులుగా తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో పోలీసులు కూంబింగ్‌ కొనసాగుతోంది. పొరుగున ఉన్న ఆసిఫాబాద్‌కొమురంభీం జిల్లా కదంబా ఎదురుకాల్పుల్లో ఈనెల 19న ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెల్సిందే. అయితే కాల్పుల నుంచి తప్పించుకున్న రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్, మరో ఇద్దరు మావోయిస్టుల కోసం ప్రాణహిత తీరం వెంట డేగ కళ్లతో నిఘా ఏర్పాటు చేశారు.





Untitled Document
Advertisements