హైదరాబాద్‌లో ముగ్గురు మహిళలు అదృశ్యం

     Written by : smtv Desk | Tue, Sep 22, 2020, 05:54 PM

హైదరాబాద్‌లో ముగ్గురు మహిళలు అదృశ్యం

హైదరాబాద్‌లో వరుసగా అమ్మాయిల అదృశ్యం అవుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా దుండిగల్ పీఎస్ పరిధిలో వేరు వేరు ఘటనల్లో ముగ్గురు మహిళలు మిస్సింగ్ అయ్యారు. దీంతో ఇప్పుడీ ఈ మిస్సింగ్ కేసులు పోలీసులకు సవాల్‌గా మారాయి.

దుండిగల్ పియస్ పరిధిలో ముగ్గురు మహిళలు అదృశ్యం అయినట్లు కేసులు నమోదయ్యాయని దుండిగల్ పియస్ సిఐ వెంకటేషం తెలిపారు.

దుండిగల్‌లో నివసించే హెచ్. శిరీష్ అనే 22 ఏళ్ల యువతి అదృశ్యం అయ్యింది. ఈనెల 19వ తేదీన ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళింది. అయితే ఈరోజు వరకు శిరీష తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె తల్లి నరసమ్మ దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. చుట్టుపక్కల వారిని, బంధువులను అడిగినా ఫలితం లేదని తెలిపింది. తన కూతురు ఆచూకీ కనుక్కోవాలని పోలీసుల్ని వేడుకుంది.

ఆ తర్వాత ఉద్యోగం చేస్తున్న వై భారతి అనే 21 ఏళ్ల మరో యువతి కూడా మిస్సింగ్ అయ్యింది. సురారం రాజీవ్ గృహకల్పలో భారతి నివాసం ఉంటుంది. ఈనెల 20వ తేదీ ఉదయం కొంపల్లిలో ఉద్యోగం నిమిత్తం వెల్తున్నానని చెప్పి ఇంట్లో నుండి బయల్దేరింది. అలా వెళ్లిన భారతి తిరిగి ఇంతవరకు ఇంటికి చేరలేదని ఆమె తండ్రి పైడితల్లి దుండిగల్ పియస్ లో ఫిర్యాదు చేసాడు. ఎమ్.పద్మావతి అనే 38 ఏళ్ల , గృహిణి కూడా అదృశ్యం అయ్యింది.

బహుదూర్ పల్లి ఇందిరమ్మ కాలనిలో పద్మావతి నివాసం ఉంటుంది. ఈనెల 20వ తేదీన భార్యభర్తలు గొడవపడి, 21వ తేదీ ఉదయం భార్య పద్మావతి ఇంట్లోనుండి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది. దీంతో భర్త లక్ష్మారెడ్డి దుండిగల్ పియస్ లో ఫిర్యాదు చేసాడు. ముగ్గురు మహిళలు మిస్సింగ్ కేసులు గా నమోదు చేసుకొని దుండిగల్ పియస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.





Untitled Document
Advertisements