గిఫ్ట్‌ ఏ స్మైల్‌ అంబులెన్స్‌ ‌లను ప్రారంభించిన కేటీఆర్

     Written by : smtv Desk | Thu, Sep 24, 2020, 12:07 PM

గిఫ్ట్‌ ఏ స్మైల్‌ అంబులెన్స్‌ ‌లను ప్రారంభించిన కేటీఆర్

గిఫ్ట్ ఏ స్మైల్ లో కార్య‌క్ర‌మంలో భాగంగా అంబులెన్స్ ల‌ను అంద‌జేశారు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్, మంచిర్యాల ఎమ్యెల్యే దివాక‌ర్ రావు అంద‌జేసిన కోవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్ ల‌ను ఐటీ, మున్సిపల్ ‌శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ప్రగతి భవన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి 3 అంబులెన్స్ లను, ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ -2, మంచిర్యాల ఎమ్మెల్యే దివాక‌ర్ రావు-1 అంబులెన్స్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. అంబులెన్స్‌లను కొవిడ్‌ సహాయక చర్యలకు ప్రభుత్వానికి అందజేసిన వారికి ఈ సందర్భంగా కేటీఆర్‌ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్‌ జన్మదినోత్స‌వం సంద‌ర్భంగా ఇచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ ఏ కార్య‌క్ర‌మంలో భాగంగా కరోనా బాధితుల కోసం కోవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్ ల‌ను గిఫ్ట్ గా ఇచ్చామ‌న్నారు. నిర్మ‌ల్, మంచిర్యాల జిల్లాలోని క‌లెక్ట‌ర్ల ఆధ్వర్యంలో ప్ర‌భుత్వ‌ వెద్య‌శాల‌ల నిర్వ‌హ‌ణ‌లో ఈ అంబులెన్స్ ల‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంచుతామ‌న్నారు. ఈ వాహనాల్లో ఆక్సీజన్‌, వెంటిలేటర్‌తో సహా, అత్యాధునిక సదుపాయాలను కల్పించారు. కరోనా బారిన పడిన సీరియస్‌ పెషెంట్లకు అవసరమైన సదుపాయాలన్నీ ఇందులో ఉన్నాయని వివ‌రించారు.





Untitled Document
Advertisements