తూర్పు లడఖ్లో భారత జవాన్ల దూకుడుకు చైనా సైన్యం బెంబేలెత్తిపోతోంది. తూర్పు లడఖ్లో ఒప్పందాన్ని గాలికి వదిలేసి... ఆక్రమణకు యత్నించిన డ్రాగన్కు భారత సైన్యం ఎదురునిలిచి, దాని కుట్రలను బలంగా తిప్పికొడుతోంది. ఇండియన్ ఆర్మీ ధైర్యాన్ని చూసి... చైనా సైనికుల వెన్నులో వణుకుపుడుతోంది. ఈ నేపథ్యంలో భారత సరిహద్దుల్లో విధులంటనే భయపడేస్థాయికి చైనా సైన్యం వచ్చినట్టు తైవాన్ మీడియా ప్రత్యేక కథనాన్ని వెలువరించింది.
చైనా సైన్యంలోకి కొత్తగా చేరిన యువకుల్లో ఉత్సాహం మచ్చుకైనా కనిపించడం లేదని, పైగా వారంతా భోరున ఏడుస్తున్నారని పేర్కొంది. ఒకవేళ భారత సరిహద్దుల్లో విధులకు వెళ్తే.. అక్కడ నుంచి తిరిగొస్తామా? అని మానసికంగా ఆందోళన చెందుతున్నట్టు వివరించింది. వారిలో నిలువెల్లా పిరికితనం ఆవహించిందనడానికి సాక్ష్యంగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. దీనిని పాకిస్థాన్ హాస్యనటుడు జమీద్ హమీద్ సెప్టెంబరు 20న తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
సెప్టెంబరు 15న చైనా హుబే ప్రావిన్సులోని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (సీపీఎల్ఏ)కి కొత్తగా ఎంపికైన యువతకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. వీరికి ప్రస్తుతం భారత్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తూర్పు లద్ధాఖ్ సరిహద్దుల వద్ద పోస్టింగ్ ఇచ్చారు. దీంతో వారు భయభ్రాంతులకు గురై బస్సులో లడఖ్ సరిహద్దులకు వెళతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టు వీడియోలో కనబడుతోంది. వణుకుతున్న గొంతులతోనే తమ సైనిక గీతమైన ‘గ్రీన్ ఫ్లవర్స్ ఇన్ ద ఆర్మీ’ ని ఆలపించారు.
దీనికి సంబంధించిన వీడియో గతవారం తూర్పు ప్రావిన్సుల్లోని అన్హుయిలో ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా... పాక్ నటుడు దానిని ఫేస్బుక్లో షేర్ చేశాడు. ఈ వీడియో ఆధారంగా తైవాన్ మీడియా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. తూర్పు లడఖ్లో భారత సైనికులతో పోరాడాల్సి వస్తుందన్న భయంతోనే చైనా యువ సైనికులు ఏడుపు లంకించుకున్నారని పేర్కొంది.
mdash;(@waynescene) September 20, 2020