ఐపీఎల్ 2020 పాయింట్ల పట్టికలో MI టాప్

     Written by : smtv Desk | Thu, Sep 24, 2020, 01:03 PM

ఐపీఎల్ 2020 పాయింట్ల పట్టికలో MI టాప్

ఐపీఎల్ 2020 పాయింట్ల పట్టికలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ టాప్‌లోకి దూసుకెళ్లింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అబుదాబి వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో గెలుపొందిన ముంబయి ఇండియన్స్ మెరుగైన నెట్‌ రన్‌రేట్‌ సాయంతో నెం.1 స్థానంలో నిలవగా.. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ టాప్-4లో చోటు దక్కించుకున్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టూ మిగిలిన ఏడు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడనుండగా.. లీగ్ స్టేజ్ ముగిసే సమయానికి పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కి అర్హత సాధించనున్నాయి.

భారీ అంచనాల నడుమ టోర్నీలో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ని ఓడించి టాప్‌లోకి వెళ్లినా.. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ చేతిలో రెండో మ్యాచ్‌లో ఓడి ఐదో స్థానానికి పరిమితమైంది. ఇక ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలుపు బోణి కొట్టలేదు. దాంతో.. పట్టికలో ఈ మూడు జట్లు వరుసగా 6, 7, 8 స్థానాల్లో నిలిచాయి

వాస్తవానికి లీగ్ దశలో మ్యాచ్‌లు గెలవడం టీమ్స్‌కి ఎంత ముఖ్యమో.. నెట్‌ రన్‌రేట్‌ని కాపాడుకోవడం కూడా అంతే కీలకం. ఐపీఎల్ 2019 సీజన్‌లో లీగ్ దశ ముగిసే సమయానికి ముంబయి, చెన్నై, ఢిల్లీ టీమ్స్ 18 పాయింట్లతో టాప్-3తో నిలవగా నాలుగో బెర్తు కోసం హైదరాబాద్, కోల్‌కతా, పంజాబ్ జట్లు 12 పాయింట్లతో పోటీపడ్డాయి. అప్పుడు సన్‌రైజర్స్‌ని రేసులో ముందు నిలిపి ప్లేఆఫ్‌కి చేర్చింది నెట్‌ రన్‌రేట్. కాబట్టి.. ఫస్ట్ మ్యాచ్ నుంచే టీమ్స్ నెట్‌ రన్‌రేట్‌ని కాపాడుకోవడంపై ఎక్కువ శ్రద్ధ కనబరుస్తాయి.





Untitled Document
Advertisements