రైతులకు కేంద్రం తీపికబురు...మోదీ సర్కార్ ముందు మరో కీలక ప్రతిపాదన

     Written by : smtv Desk | Thu, Sep 24, 2020, 02:08 PM

రైతులకు కేంద్రం తీపికబురు...మోదీ సర్కార్ ముందు మరో కీలక ప్రతిపాదన

కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయం పెంచాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే వారి కోసం ఆర్థిక సాయం అందిస్తోంది. పీఎం కిసాన్ స్కీమ్ కింద ఏడాదికి రూ.6,000 బ్యాంక్ అకౌంట్లలో జమచేస్తోంది. ఈ రూ.6 వేలు మూడు విడతల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి వస్తోంది.

అయితే రైతులకు పీఎం కిసాన్ స్కీమ్ కింద పొందే రూ.6,000కు అదనంగా మరో రూ.5,000 పొందే అవకాశం అందుబాటులోకి రానుంది. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (సీఏసీపీ) తాజాగా కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన చేసింది. రైతులకు పీఎం కిసాన్ స్కీమ్ కింద అందించే రూ.6 వేలతోపాటు మరో రూ.5,000 అందించాలని రికమెండ్ చేసింది.

రైతులకు ప్రతి ఏడాది ఫెర్టిలైజర్స్ సబ్సిడీ కింద రూ.5,000 అందించాలని సూచించింది. ఈ డబ్బులు కూడా రైతుల బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా జమ కావాలని తెలిపింది. ఒకేసారి కాకుండా రెండు విడతల్లో ఈ డబ్బులు అందిస్తే బాగుంటుందని పేర్కొంది. అంటే ఖరీఫ్ పంటకు రూ.2,500, రబీ పంటకు మరో రూ.2,500 అందించాలని సూచించింది.

కమిషన్ చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే అప్పుడు ఫెర్టిలైజర్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ బంద్ అవుతుంది. ఈ సబ్సిడీ డబ్బులు నేరుగా అన్నదాతల బ్యాంక్ అకౌంట్‌లోకి వచ్చి చేరతాయి. కేంద్ర ప్రభుత్వం ఫెర్టిలైజర్ కంపెనీలకు అందిస్తున్న సబ్సిడీ వల్ల రైతులకు యూరియా సహా ఇతర ఎరువులు తక్కువ ధరకే లభిస్తున్నాయి.

ఇకపోతే కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రస్తుతం రూ.2,000 చొప్పున ఏడాదికి మూడు సార్లు అంటే రూ.6,000 అన్నదాతలకు అందిస్తోంది. బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. కేంద్ ప్రభుత్వం కమిషన్ సిఫార్సు చేసిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుంటే అప్పుడు రైతుల అకౌంట్లోకి ఏడాదికి రూ.11,000 వచ్చి చేరతాయి.





Untitled Document
Advertisements