అరబ్ కంట్రీ దుస్థితి...ఉద్యోగుల జీతాలకు డబ్బులు కరువు!

     Written by : smtv Desk | Thu, Sep 24, 2020, 07:18 PM

అరబ్ కంట్రీ దుస్థితి...ఉద్యోగుల జీతాలకు డబ్బులు కరువు!

ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తాజాగా కువైట్ రేటింగ్‌ను తగ్గించేసింది. బలహీనమైన పరిపాలన, నిధుల కొరత వంటి అంశాల ప్రాతిపదికన రేటింగ్‌లో కోత విధించింది. ముడి చమురు ధరలు పడిపోవడం వల్ల కువైట్ ఇప్పుడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే.

అక్టోబర్ నెల తర్వాత ఈ సంక్షోభం మరింత తీవ్రతరం కావొచ్చనే అంచనాలున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితులు అక్కడ కనిపించడం లేదు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా పెట్రోకెమికల్స్ కలిగిన దేశం ఇప్పుడు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితిలోకి జారుకుంటోంది. క్రూడ్ ధరలు పడిపోవడం, రాబడి తగ్గిపోవడ ఇందుకు ప్రధాన కారణం.

ప్రస్తుతం కువైట్ దగ్గర ఉన్న ఆర్థిక వనరులు కూడా తగ్గిపోతున్నాయని మూడీస్ తెలిపింది. సావరిన్ హెల్త్ ఫండ్ అసెట్స్ నుంచి లోన్ తీసుకోవడానికి అవసరమైన చట్టపరమైన అనుమతులకు కూడా ఇంకా ఆమోదం లభించలేదని పేర్కొంది. మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ తాజాగా కువైట్ రేటింగ్‌ను ఏఏ2 నుంచి ఏ1కు తగ్గించేసింది.

2017లో చివరిగా కువైట్ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో బాండ్లను జారీ చేసి రుణాలు సమీకరించింది. కువైట్‌లో ముడి చమురు అసెట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇన్వెస్టర్లు కూడా ఈ బాండ్లు సురక్షితమని భావించి కొనుగోలు చేసే వారు. ఇప్పుడు కువైట్ ఆర్థిక వ్యవస్థ కరోనా వైరస్ కారణంగా ఏకంగా 46 బిలియన్ డాలర్లను కోల్పోయింది. కొత్త రుణ చట్టంపై పార్లమెంట్, ప్రభుత్వం మధ్య నెలకొన్ని ఘర్షణ, క్రూడ్ ధరల పతనం ఇందుకు ప్రధాన కారణం.

కువైన్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను కూడా 3 బిలియన్ డాలర్ల మేర తగ్గించుకుంది. అయితే కొత్త రుణ చట్టం ఆమోదం పొందితే అప్పుడు పరిస్థితులు అదుపులోకి రావొచ్చని మూడీస్ పేర్కొంది. అప్పుడు అక్కడి ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్ నుంచి రుణాలు సమీకరించడం సులభతరమౌతుందని తెలిపింది. కాగా కువైట్ ఆదాయంలో 89 శాతం క్రూడాయిల్ నుంచే వస్తుంది.





Untitled Document
Advertisements