కరోనా శవం ఒంటిపై బంగారం చోరీ

     Written by : smtv Desk | Thu, Sep 24, 2020, 11:10 PM

కరోనా శవం ఒంటిపై బంగారం చోరీ

కరోనాతో చనిపోయిన వారి ఒంటిపై సొత్తులకు భద్రత లేకుండా పోతోంది. ఏకంగా హాస్పిటళ్ల వార్డుల్లోనే సిబ్బంది చేతి వాటం ప్రదర్శిస్తూ అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. కరోనాతో చనిపోయిన శవాల వద్ద బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్‌లు మాయం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఉదంతం తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. మృత దేహాం నుంచి బంగారు ఉంగరాలు.. సెల్ ఫోన్‌ను దొంగిలించారు. ఈ తతంగం మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. తిరుపతి స్విమ్స్‌లో జరుగుతున్న అకృత్యాలు చూసి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా 10 రోజుల క్రితం తిరుపతి స్విమ్స్‌లో కరోనా బారిన పడి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లెకి చెందిన వెంకటరత్నం నాయుడు అనే వ్యక్తి చేరారు. కరోనాతో బుధవారం సాయంత్రం చనిపోయారు. మృతదేహాన్ని చూడ్డానికి వెళ్లిన సమయంలో కుటుంబ సభ్యులకు అతని ఒంటిపై బంగారు ఆభరణాలు కనిపించలేదు. తన తండ్రి చేతికి, ఒంటిపై బంగారు ఆభరణాలు ఉన్నాయని ఆయన కొడుకు మహేష్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించారు. పట్టించుకోని స్విమ్స్ సెక్యూరిటీ అధికారులు పట్టించుకోలేదని తెలిపారు.

చివరికి మృతుని చేతికి ఉంగరాలు ఉండడం సీసీటీవీలో రికార్డ్ అయింది. అంతేకాక, అతని ఒంటిపై ఆభరణాలు సిబ్బందే దోచేయడం సీసీటీవీ కెమెరాలో రికార్డు అవడంతో మొత్తం బండారం బయటపడింది.





Untitled Document
Advertisements