కొత్త సర్వీసులు లాంచ్ చేసిన బ్యాంక్...కస్టమర్లకు శుభవార్త

     Written by : smtv Desk | Fri, Sep 25, 2020, 12:08 PM

కొత్త సర్వీసులు లాంచ్ చేసిన బ్యాంక్...కస్టమర్లకు శుభవార్త

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ తాజాగా తన కస్టమర్ల కోసం కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. సేఫ్‌పే ఫెసిలిటీ పేరుతో ఈ సేవలను ఆవిష్కరించింది. దీని ద్వారా బ్యాంక్ కస్టమర్లు వారి స్మార్ట్‌ఫోన్ ద్వారా పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) టర్మనల్స్ వద్ద నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC) ద్వారా సులభంగానే చెల్లింపులు నిర్వహించొచ్చు.

ఇక్కడ ఐడీఎఫ్‌సీ బ్యాంక్ తీసుకువచ్చిన మొబైల్ యాప్‌ ద్వారా ఈ సర్వీసులు ఉపయోగించి డెబిట్ కార్డు లేకుండానే చెల్లింపులు చేసేయొచ్చు. దీంతో డెబిట్ కార్డును పీఓఎస్ మెషీన్లలో స్వైప్ చేయాల్సిన పని లేదు. అంటే కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్ నిర్వహించొచ్చు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సర్వీసుల వల్ల కస్టమర్లకు ప్రయోజనం కలుగనుంది.

సేఫ్టీ పే సదుపాయాన్ని బ్యాంక్ పరీక్షించిందని, వచ్చే వారంలో రోజుల్లోగా ఈ సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తామని బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ మొబైల్ యాప్ ద్వారానే ఈ సర్వీసులు కూడా పొందొచ్చని పేర్కొంది. సేఫ్టీ‌పే ద్వారా రూ.2,000 వరకు ట్రాన్సాక్షన్లను నిర్వహించొచ్చు. రోజుకు రూ.20,000 వరకు ఇలా చెల్లింపులు చేయొచ్చు.

బ్యాంక్ కస్టమర్లు ఈ సర్వీసులు పొందాలంటే ముందుగా వారి డెబిట్ కార్డును మొబైల్ యాప్‌తో లింక్ చేసుకోవాలి. తర్వాత ఎన్‌ఎఫ్‌సీ ఫీచర్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను అన్‌లాక్ చేయాలి. ఎన్‌ఎఫ్‌సీ ఫీచర్ ఉన్న పీఓఎస్ మెషీన్ వద్ద దీన్ని ఉంచాలి. ఇప్పుడు లావాదేవీ పూర్తి చేయాలి. ఇక్కడ మీరు ఈ ప్రయోజనం పొందాలని భావిస్తే మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎన్ఎఫ్‌సీ ఫీచర్ ఉండాలి.





Untitled Document
Advertisements