ఐపీఎల్ 2020 పాయింట్ల పట్టిక...టాప్ లో పంజాబ్

     Written by : smtv Desk | Fri, Sep 25, 2020, 01:03 PM

ఐపీఎల్ 2020 పాయింట్ల పట్టిక...టాప్ లో పంజాబ్

ఐపీఎల్ 2020 సీజన్ పాయింట్ల పట్టికలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అనూహ్యంగా నెం.1 స్థానానికి దూసుకొచ్చింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అబుదాబి వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 97 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న పంజాబ్ జట్టు రెండు పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. వాస్తవానికి పంజాబ్‌తో పాటు ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా రెండేసి పాయింట్లతో ఉన్నాయి. కానీ.. ఈ జట్లతో పోలిస్తే పంజాబ్ టీమ్‌కి డబుల్ నెట్ రన్‌రేట్‌తో ఉండటంతో మెరుగైన స్థానం దక్కింది. లీగ్ దశ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కి అర్హత సాధించనున్నాయి.

ఐపీఎల్ 2020లో ఆడిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై అలవోక విజయాన్ని అందుకునేలా కనిపించిన పంజాబ్ జట్టు.. అనూహ్యంగా చివరి ఓవర్‌లో తడబడి మ్యాచ్‌ని సూపర్‌ ఓవర్ వరకూ తీసుకెళ్లి పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే.. గురువారం రాత్రి బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ చెలరేగిపోయింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (132 నాటౌట్: 69 బంతుల్లో 14x4, 7x6) అజేయ శతకం బాదడంతో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసిన పంజాబ్.. అనంతరం ఛేదనకు దిగిన బెంగళూరుని 109 పరుగులకే కట్టడి చేసింది.

టోర్నీలో గెలుపు బోణి కొట్టని జట్లుగా ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, ఇయాన్ మోర్గాన్ లాంటి పవర్ హిట్టర్లు ఉన్న ఆ జట్టు.. తొలి మ్యాచ్‌‌లో ముంబయి ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్.. బెంగళూరు చేతిలో ఓడి పట్టికలో 7వ స్థానంతో సరిపెట్టింది.





Untitled Document
Advertisements