తెలంగాణలో మరింత అధికం అవుతున్న కరోనా కేసులు

     Written by : smtv Desk | Fri, Sep 25, 2020, 01:09 PM

తెలంగాణలో మరింత అధికం అవుతున్న కరోనా కేసులు

తెలంగాణలో గురువారం నాటి కరోనా కేసులకు సంబంధించిన హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు. గురువారం మొత్తం 2381 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా అందులో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,81,627 కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 30,387గా ఉన్నాయి. మరో 24,592 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 2,021 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇక గురువారం మరో 10 మంది కరోనాకు బలి కాగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1080కి చేరింది.

గురువారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కేసులను గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 386 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది. ఇక్కడ 227 కొత్త కేసులు గుర్తించారు. ఆ తర్వాతి స్థానంలో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఉంది. ఇక్కడ 193 కొత్త కేసులు నమోదయ్యాయి.

మరోవైపు, తెలంగాణలో గురువారం ఒక్కరోజే 57,621 కరోనా టెస్టులు నిర్వహించారు. వీటిలో నుంచే 2381 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ తెలంగాణలో చేసిన కరోనా టెస్టుల సంఖ్య 27 లక్షలు దాటింది. ఇప్పటి వరకూ సేకరించిన నమూనాల్లో మరో 1659 మంది ఫలితాలు తేలాల్సి ఉంది. జిల్లాల వారీగా నమోదైన కేసులు, తెలుగులో హెల్త్ బులెటిన్ పూర్తి వివరాలకు కింది పీడీఎఫ్ ఫైల్ క్లిక్ చేయండి.





Untitled Document
Advertisements