ఎస్పీబీ అస్తమయం ప‌ట్ల కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి

     Written by : smtv Desk | Fri, Sep 25, 2020, 05:17 PM

ఎస్పీబీ అస్తమయం ప‌ట్ల కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి

దిగ్గజ గాన గాంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్రహ్మణ్యం అస్తమయం ప‌ట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాలు కుటుంబ స‌భ్యుల‌కు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బాలు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని పేర్కొన్నారు. ఆయన ఎన్నో భాషల్లో వేలాది పాటలు పాడి ప్రజ‌ల అభిమానం చూరగొన్నారని గుర్తు చేసుకున్నారు. గాయ‌కుడిగా, న‌టుడిగా, సంగీత ద‌ర్శకుడిగా రాణించారని అన్నారు.

‘‘గానగంధర్వుడు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం దురదృష్టకరం. సినీలోకానికి వారు చేసిన సేవలు వెలకట్టలేనివి. అనేక భాషలలో పాటలుపాడి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న బాలు గారు లేని లోటు ఎన్నటికి పూడ్చలేనిది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.’’ అని హరీష్ రావు ట్వీట్ చేశారు.





Untitled Document
Advertisements