కస్టమర్లకు ఎస్‌బీఐ అలర్ట్...ఈమెయిల్స్ జాగ్రత్త!

     Written by : smtv Desk | Sat, Sep 26, 2020, 01:33 PM

కస్టమర్లకు ఎస్‌బీఐ అలర్ట్...ఈమెయిల్స్ జాగ్రత్త!

దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా తన కస్టమర్లను హెచ్చరించింది. మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసింది. మోసపూరిత ఈమెయిల్స్‌‌తో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. బ్యాంక్ నుంచి వచ్చే మెయిల్స్ మాదిరిగానే మోసగాళ్లు కూడా మెయిల్స్ పంపిస్తున్నారని పేర్కొంది.

‘ఎస్‌బీఐ పేరుపై, ఎస్‌బీఐ మాదిరిగానే ఖాతాదారులకు ఫేక్ మెయిల్స్ వస్తున్నాయి. ఇలాంటి మెయిల్స్‌పై క్లిక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మేం కస్టమర్లక ఇలాంటి మెయిల్స్ పంపించడం లేదు’ అని స్టేట్ బ్యాంక్ ట్వీట్ చేసింది. అంతేకాకుండా అవి ఎలా ఉంటాయో కూడా తెలియజేసింది.

ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి లింక్ కూడా అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా మోసపూర్తిత ఈమెయిల్స్ వస్తే ఆ విషయాన్ని వెంటనే బ్యాంక్‌కు తెలియజేయాలని కోరింది. దీని కోసం కూడా ఒక లింక్ అందుబాటులో ఉంచింది. ఇవి ఎస్‌బీఐ ట్వీట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఎస్‌బీఐ బ్యాంక్ కస్టమర్లకు ఎలాగైతే మెయిల్స్ పంపిస్తుందో.. ఇవి చూడటానికి ఎలాగైతే ఉంటాయో.. మోసగాళ్లు పంపించే మెయిల్స్ కూడా ఇలానే ఉంటాయి. ఈమెయిల్ స్కామ్, ఫిషింగ్ వంటి వంటి సైబర్ క్రైమ్స్‌తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అందువల్ల బ్యాంక్ నుంచి మెయిల్స్‌ను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం మంచిది.






Untitled Document
Advertisements