కళ్లుచెదిరే లాభం: రూ.50తో చేతికి రూ.19,000

     Written by : smtv Desk | Sat, Sep 26, 2020, 08:32 PM

కళ్లుచెదిరే లాభం: రూ.50తో చేతికి రూ.19,000

డబ్బు సంపాదించాలని యోచిస్తున్నారా? అది కూడా కోటీశ్వరులు కావాలని కల కంటున్నారా? అయితే ఇది అంత సులవైన పని కాదు. రూ.కోట్లు వెనకేయడమంటే కష్టమే. అయితే ఒక విధంగా చూస్తే ఇది కూడా సులభమే అనిపిస్తుంది. అవును. ఎలా అంటారా? దీనికి సమాధానం స్టాక్ మార్కెట్. ఈక్విటీ మార్కెట్‌లో డబ్బులు పెట్టి కోటీశ్వరులు కావొచ్చు.

అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. స్టాక్ మార్కెట్‌లో రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుందని గమనించాలి. అందువల్ల స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకున్న తర్వాతనే డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. లేదంటే పెట్టిన డబ్బులు ఒక్క రూపాయి కూడా వెనక్కి రాకపోవచ్చు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి.

అంతేకాకుండా స్టాక్ మార్కెట్‌లో అన్ని రకాల షేర్లు ఒకే రకమైన రాబడిని అందించవు. కొన్ని షేర్లు మిగతా వాటి కన్నా అదిరిపోయే పనితీరు కనబరిచి, ఇన్వెస్టర్లకు కళ్లుచెదిరే లాభాన్ని అందిస్తుంటాయి. వీటిని మల్టీ బ్యాగర్ స్టాక్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి ఓపిక ఉండాలి. డబ్బులు పెట్టిన వెంటనే భారీ లాభం రావాలంటే కుదరదు. దీర్ఘకాలం పాటు వేచి ఉండాలి.

ఇప్పుడు ఇన్వెస్టర్లకు అదిరిపోయే లాభాన్ని అందించిన ఒక షేరు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే శ్రీ సిమెంట్ షేరు. ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు కళ్లుచెదిరే రాబడిని అందించింది. మీరు 20 ఏళ్ల కిందట అంటే 2001లో ఈ షేరులో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు మీకు ఏకంగా రూ.7.8 కోట్లు లభించేవి. అంతేకాకుండా ఇక్కడ మరో బెనిఫిట్ కూడా ఉంది. ఈ కంపెనీ డివిడెండ్ల రూపంలో ఇన్వెస్టర్లకు మరో రూ.20 లక్షలు అందించింది. 2001లో ఈ షేరు ధర కేవలం రూ.50 వద్ద ఉండేది. ఇప్పుడు రూ.19 వేల స్థాయికి చేరింది. అంటే రూ.50 పెట్టి ఉంటే రూ.19 వేలు వచ్చి ఉండేవి.





Untitled Document
Advertisements