IPL 2020: చెత్త రికార్డును మూటగట్టుకున్న జడేజా

     Written by : smtv Desk | Sat, Sep 26, 2020, 08:39 PM

IPL 2020: చెత్త రికార్డును మూటగట్టుకున్న జడేజా

చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఈ ఐపీఎల్‌లో చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఒంటి చేత్తో టీమిండియాకు, చెన్నై సూపర్ కింగ్స్‌కు అనేక విజయాలు అందించిన ఈ ఆల్‌రౌండర్.. ప్రస్తుతం ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా.. 4 ఓవర్లు బౌలింగ్ చేసి 44 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో ఐపీఎల్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 40కిపైగా పరుగులిచ్చిన తొలి స్పిన్నర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు.

శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ధోనీ ఫీల్డింగ్ ఎంచుకోగా.. చెన్నై బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. జడేజా వేసిన తొలి బంతినే శిఖర్ ధావన్ సిక్స్‌గా మలిచాడు. జడేజా వేసిన రెండో ఓవర్లో పృథ్వీ షా డామినేట్ చేయడంతో 15 రన్స్ వచ్చాయి.

ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 42 పరుగులిచ్చిన జడేజా 2 వికెట్లు తీశాడు. రాజస్థాన్ రాయల్స్‌పై 4 ఓవర్లు వేసి 40 పరుగులిచ్చాడు. మరో స్పిన్నర్ పియూష్ చావ్లా తొలి మూడు మ్యాచ్‌ల్లో 21/1, 55/1, 33/2 చొప్పున గణాంకాలు నమోదు చేశాడు.





Untitled Document
Advertisements