కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ కూడలి వద్ద నిరంతరం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతం. అక్కడ విధులు నిర్వర్తించే సిబ్బంది ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా భారీగా వాహన రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.
ఇంతటి కీలకమైన హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ కూడలి వద్ద కానిస్టేబుల్ దేవిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం (సెప్టెంబర్ 25) సాయంత్రం విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. చిరుజల్లులుగా ప్రారంభమై కుండపోత వర్షంగా మారింది. అయినా ఏమాత్రం వెనుక్కి చూసుకోకుండా జోరు వానలో తడుస్తూనే, వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా ఎంతో నిబద్ధతతో కానిస్టేబుల్ శ్రీనివాస్ విధులు నిర్వర్తించారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జోరువానలో ఏ మాత్రం తప్పిదం జరిగినా ట్రాఫిక్ స్తంభించిపోయేది. అయితే వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో నిమగ్నమై కానిస్టేబుల్ శ్రీనివాస్ చూపిన చొరవకు.. రాష్ట్ర హోం మాంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందనలు తెలిపారు. ఈ తరుణంలో శనివారం జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు జిల్లా పోలీసు కార్యాలయంలో సదరు కానిస్టేబుల్ శ్రీనివాస్ను దుశ్శాలువతో సత్కరించి, తను చేసిన సేవకు ప్రోత్సాహకంగా నగదు రివార్డును అందజేసి అభినందనలు తెలిపారు.
Rain or shine, day or night, fire or floods - our policemen are always in the service of citizens. (1/2)#AndhraPradesh #HanumanJunction #KrishnaDistrict #SelflessPolicing #ResponsiblePolicing #CallOfDuty #HighwayIntersection #KrishnaDistrictPolice https://t.co/b2jnpAIlDn
mdash; Andhra Pradesh Police (@APPOLICE100) September 26, 2020