తిరుపతి పోలీసులకు హ్యాకర్లు షాక్

     Written by : smtv Desk | Sun, Sep 27, 2020, 12:48 PM

తిరుపతి పోలీసులకు హ్యాకర్లు షాక్

పోలీసులకు సైబర్ కష్టాలు తప్పడం లేదు. ఈ మధ్య సైబర్‌ కేటుగాళ్లు పోలీసుల్ని టార్గెట్ చేశారు. కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పలువురు పోలీసు అధికారుల ఫేస్‌బుక్‌ ఖాతాలను హ్యాక్‌ చేసి మోసాలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు తిరుమల, తిరుపతికి చెందిన పలువురు పోలీసు అధికారుల ఫేస్‌బుక్‌ అకౌంట్లను హ్యాక్‌ చేశారు. మాయ మాటలతో డబ్బుల్ని గుంజే ప్రయత్నం చేశారు. విషయం తెలిసి పోలీసు అధికారులు ఒకింతి షాకయ్యారు.

సీఐలు రామకృష్ణ, గిరిధర్‌.. ఎస్సైలు తిమ్మయ్య, సుమతి ఫేస్‌బుక్‌లు హ్యాక్‌ చేసినట్లు గుర్తించారు. పోలీసుల ఫేస్‌బుక్‌ స్నేహితులలకు డబ్బులు పంపమంటూ హ్యాకర్లు మెసింజర్‌ ద్వారా మెసేజ్ పంపారు. అనుమానం రావడంతో కొందు ఈ విషయంపై ఫోన్‌ చేసి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. తమ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లు హ్యాక్‌కు గురయ్యాయని.. తమ పేరుతో వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దన్నారు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ ద్వారా తెలియజేశారు. ఇటు హ్యాక్‌ అయిన ఫేస్‌బుక్ అకౌంట్లను బ్లాక్‌ చేయించి.. తిరుపతి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై సైబర్ క్రైం పోలీసులు ఆరా తీస్తున్నారు.





Untitled Document
Advertisements